Wednesday, 16 July 2025 10:24:56 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

gurdaspur village: గ్రామ సర్పంచ్ పదవి రూ.2కోట్లు...ఎక్కడంటే ..!

Date : 02 October 2024 02:24 PM Views : 127

Studio18 News - జాతీయం / : ఓ గ్రామ సర్పంచ్ పదవికి బహిరంగ వేలం నిర్వహించడం, ఆ పదవిని వేలంలో ఓ నేత రూ.2కోట్లకు దక్కించుకోవడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ వ్యాప్తంగా 13,237 సర్పంచి స్థానాలకు ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 4వ తేదీ నామినేషన్‌లకు తుది గడువు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటనలు వచ్చాయి. అయితే, ఈ పోలింగ్ ప్రక్రియతో సంబంధం లేకుండా ఓ గ్రామంలో సర్పంచి పదవికి వేలం పాట ద్వారా ఎన్నుకోవడం, అదీ రెండు కోట్ల వరకూ పలకడం తీవ్ర చర్చనీయాంశమైంది. గురుదాస్‌ పుర్‌లోని హర్దోవల్ కలన్ గ్రామంలో సర్పంచి పదవికి వేలం పాట నిర్వహించారు. రూ.50లక్షలతో వేలం మొదలు కాగా, స్థానిక బీజేపీ నేత అత్మాసింగ్ ఏకంగా రూ.2కోట్లకు పాడాడు. గ్రామానికి ఎవరు ఎక్కువ నిధులు ఇస్తారో వారినే సర్పంచిగా ఎన్నుకుంటారని సదరు నేత చెబుతున్నారు. ఈ వేలం పాట ఎన్నికపై రాజకీయ దుమారం చెలరేగడంతో అధికారులు స్పందించారు. గ్రామంలో జరిగిన ఈ వేలంపై జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. మరో వైపు సర్పంచ్ ఎన్నికకు ఆత్మాసింగ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచి పదవికి వేలం నిర్వహించడంపై అక్కడి కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ సర్పంచి పదవి వేలం అంశంపై తీవ్ర చర్చనీయాంశం కావడం, అధికార యంత్రాంగం సైతం స్పందించడంతో ఏమి జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :