Thursday, 15 January 2026 06:41:33 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ

Date : 12 January 2026 07:34 PM Views : 43

Studio18 News - జాతీయం / : 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని ఆరోపణ నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న మమతా బెనర్జీ ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పటి నుంచి ఈసీకి ఇది ఐదో లేఖ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఉపయోగిస్తున్న 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని ఆమె ఆరోపించారు. దీనివల్ల నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె అన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఆమె లేఖ రాశారు. ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ఈసీకీ లేఖ రాయడం ఇది ఐదోసారి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ చేపట్టారని, అయితే ఈ ప్రక్రియ సందర్భంగా ఓటర్ల వివరాల్లో తీవ్ర తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇది పెద్ద ఎత్తున డేటా మిస్ మ్యాచ్‌కు దారి తీసిందని, దీనివల్ల నిజమైన ఓటర్లు ఈ సమస్య బారిన పడుతున్నారని అన్నారు. ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి గత రెండు దశాబ్దాలుగా అనుసరించిన విధానాలను ఈసీ ఇప్పుడు పక్కన పెట్టిందని ఆమె ఆరోపించారు. దీనితో ఓటర్లు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ ఎప్పటినుంచో వస్తున్న తన సొంత పద్ధతులను విస్మరించడాన్ని ఆమె ఖండించారు. ఇది ఏకపక్షంగా, అహేతుకంంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. ఎస్ఐఆర్ సమయంలో సమర్పించిన పత్రాలకు సరైన రసీదు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ ప్రక్రియలోనే లోపం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా వరకు యాంత్రికంగా, సాంకేతిక డేటా ఆధారంగానే కొనసాగుతోందని, సున్నితత్వం, మానవీయతను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :