Thursday, 17 July 2025 12:03:50 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు

Date : 14 June 2025 11:50 AM Views : 94

Studio18 News - జాతీయం / : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సరైన నిర్వహణ లేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి జైరాజ్‌సింహ్ పర్మార్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రమాదానికి మూడు రోజుల ముందు తాను అదే విమానంలో ప్రయాణించానని, అప్పుడే పలు లోపాలను గమనించానని ఆయన తెలిపారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌కు తాను ప్రయాణించిన సమయంలో విమానంలో జీపీఎస్ వ్యవస్థ సరిగా పనిచేయలేదని జైరాజ్‌సింహ్ పర్మార్ పేర్కొన్నారు. అంతేకాకుండా, సీట్లు కూడా దెబ్బతిని ఉన్నాయని, అంతర్గత టెలికం సేవలు అందుబాటులో లేవని, డెస్కులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని ఆయన వివరించారు. "ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో అనేక సౌకర్యాలుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ ఎయిర్ ఇండియాలో అవేవీ కనిపించవు. విమానానికి సరైన నిర్వహణ ఉన్నట్టు అనిపించలేదు" అని పర్మార్ అన్నారు. "ఎయిర్ ఇండియా" పేరులో "ఇండియా" అనే పదం ఉండటం వల్ల ఇటువంటి ఘటనలు మన దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, ఇది బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :