Wednesday, 16 July 2025 10:46:09 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Crime News : భార్య అతిగా ఖర్చు చేయడాన్ని తట్టుకోలేక పోయిన భర్త.. అరెస్టు చేసిన పోలీసులు..

Date : 26 August 2024 10:54 AM Views : 171

Studio18 News - జాతీయం / : Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్యాలియర్ లో విషాధ ఘటన చోటు చేసుకుంది. భార్య డబ్బులను అతిగా ఖర్చు చేస్తుండటంతో భర్త తట్టుకోలేక పోయాడు. అయితే, చివరికి పోలీసులు భర్తను అరెస్టు చేశారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయాల్లోకి వెళితే.. 2017 సంవత్సరంలో గ్యాలియర్ లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొంటున్న సమయంలో అజయ్, ముస్కాన్ లకు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొద్దిరోజులకే వారి విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు దూరమయ్యారు. కొద్దికాలానికి ఇద్దరికి వేరేవేరే వ్యక్తులతో పెళ్లిళ్లు జరిగాయి. పెళ్లి జరిగిన ఏడాదికే అజయ్, అతని భార్యకు మనస్పర్థలు వచ్చాయి. ఇరువురి మధ్య పెద్దలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినా వారు కలిసి జీవనం సాగించేందుకు ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ విడిపోయారు. అదే సమయంలో ముస్కాన్ కూడా తన భర్తతో తరచూ గొడవలు జరుగుతుండటంతో కలిసి జీవించలేమని భావించి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తరువాత ఆమె గ్వాలియర్ కు తిరిగి వచ్చింది. మునుపటి పరిచయంతో అజయ్, ముస్కాన్ లు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. 2023లో కుటుంబ సభ్యుల అనుమతితో వారు పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలంకే ముస్కాన్ తీరుపట్ల అజయ్ విసిగిపోయాడు. ముస్కాన్ స్థాయికిమించి విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తుండటంతో పలుసార్లు అజయ్ మందలించాడు. అయినా ముస్కాన్ భర్త మాటలను పట్టించుకోకుండా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని అజయ్ భావించారు. దీనికి పక్కా ప్లాన్ అమలు చేశాడు. భార్యను చంపేందుకు కిరాయి హంతకుడితో రూ. 2.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ముస్కాన్ స్కూటీపై గుడికి వెళ్లి వస్తుంది. ఇదే సమయంలో ఆమెను వాహనం బలంగా ఢీకొట్టింది. తొలుత పోలీసులు హిట్ అండ్ రన్ గా భావించినప్పటికీ.. దానిని యాక్సిడెంట్ గా భర్త అజయ్ చిత్రీకరించాడు. సిసీటీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులకు అజయ్ మాటలపై అనుమానం ఏర్పడింది. దీంతో అజయ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్య అతిగా డబ్బులు ఖర్చు చేస్తుండటాన్ని తట్టుకోలేకనే హత్య చేయించానని చెప్పాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :