Wednesday, 16 July 2025 11:42:19 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

మంకీఫాక్స్‌పై డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరిక.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

Date : 19 August 2024 11:30 AM Views : 129

Studio18 News - జాతీయం / : Monkeypox : ప్రపంచ వ్యాప్తంగా మంకీఫాక్స్ వేగంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక.. మంకీఫాక్స్ వ్యాప్తి విషయమై గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. డ‌బ్ల్యూహెచ్‌వో ఇలా ప్రకటించడం రెండోళ్లలో ఇది రెండోసారి. మంకీ ఫాక్స్ పై డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. భారత్ లో మంకీఫాక్స్ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ డా. పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంకీఫాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై చర్చించారు. వ్యాధి వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మోదీ ఆదేశించారు. అన్నిరాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్ లను సిద్ధంగా ఉంచాలని, దేశవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తిపై పెద్దెత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మోదీ సూచించారు. 2022లో 116 దేశాల్లో 99,176 మంది ఈ వ్యాధి బారినపడగా, 208 మంది మరణించారు. కాంగో దేశంలో ఈ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని డబ్ల్యూహెచ్వో గుర్తించిందని మోదీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 15,600 కేసులు గుర్తించగా.. 537 మంది మరణించారని, అయితే, భారత్ లో ఇప్పటి వరకు ఈ ఏడాది ఒక్క కేసుకూడా నమోదు కాలేదని మోదీ అన్నారు. ఆఫ్రికాలోని అనేక రాష్ట్రాల్లో మంకీపాక్స్ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించిందని మోదీ అన్నారు. మంకీఫాక్స్ కేసులను సత్వరమే గుర్తించేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు. వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అయితే, ప్రస్తుతం 32 ల్యాబ్ లను పరీక్షలకోసం రెడీ చేయగా.. మరికొన్ని సిద్ధం చేసేందుకు అధికారులు దృష్టిసారించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :