Monday, 08 December 2025 03:54:44 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

వయనాడ్ ఘటనలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన విద్యార్థి.. 18ఏళ్ల జ్ఞాపకాలను తొలగించాడు

Date : 05 August 2024 02:52 PM Views : 282

Studio18 News - జాతీయం / : Wayanad landslides : కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో సంభవించిన ప్రకృతి విలయం వందలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో 350కిపైగా మంది మరణించారు. మరో రెండు వందల మంది ఆచూకీ లభించలేదు. పుంచిరిమట్టం గ్రామానికి చెందిన అభిజిత్ కల్లింగల్ వయస్సు 18ఏళ్లు. అతను హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థి. కొండచరియలు విరిగిపడిన ఘటన జరిగిన రోజు ఆ యువకుడు చదువు నిమిత్తం తిరువనంతపురంలో ఉన్నాడు. దీంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తన కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు, అమ్మమ్మ, మామ, అత్త, కోడలు, అతని ఇంటిలో ఆశ్రయం పొందిన నలుగురు స్నేహితులతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. వయనాడ్ విపత్తు ఘటన అభిజిత్ కు తీరని విషాదాన్ని నింపింది. అతని ఇల్లు ఎత్తులో ఉండటంతో సురక్షితమైనదిగా భావించాడు. కానీ, ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో అందులో ఉన్న 12 మంది చనిపోయారు. అతని తండ్రి, సోదరి, మామ, అత్త మృతదేహాలు శిథిలాల నుంచి బయటపడ్డాయి. అయితే, అతని తల్లి, సోదరుడు, అమ్మమ్మ, బంధువులు ఆచూకీ ఇంకా లభించలేదు. అభిజిత్ ఒంటిరిగా మిగిలిపోయాడు. అభిజిత్ మేనమామ నారాయణన్ కుటుంబం నుంచి ప్రాణాలతో అతని బంధువు ప్రణవ్ మాత్రమే ఉన్నాడు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అభిజిత్ తన తండ్రి, సోదరి అంత్యక్రియలను మరియమ్మ ఆలయ అంత్యక్రియల మైదానంలో నిర్వహించాడు. ఈ క్రమంలో తన చెల్లెలి మొహం చూసి కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతం అతను జీహెచ్ఎస్ఎస్ మెప్పాడిలోని రిలీఫ్ క్యాంపులో ఉన్నాడు. మా ఊరు చాలా అందంగా ఉండేది.. నేను చాలా చిత్రాలను నా మొబైల్ ఫోన్లో తీశాను. వాటిని చూస్తుంటే గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి తట్టుకోలేక పోతున్నాను. ఇప్పుడు చాలా వరకు వాటిని తొలగించాను. అన్నీ పొగొట్టుకున్నప్పుడు వాటిని ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటూ అభిజిత్ మొబైల్ లోని చిత్రాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాడు. ఇలా.. వయనాడ్ విపత్తులో ఎవరిని కదిలించినా తమ కుటుంబ సభ్యులను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :