Wednesday, 25 June 2025 07:46:14 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

సిద్ధిఖీ హత్య కేసు: మైనర్‌నని చెప్పుకున్న నిందితుడు ధర్మరాజ్‌కు బోన్ ఆసిఫికేషన్ టెస్ట్.. ఏం తేలిందో తెలుసా?

Date : 14 October 2024 10:47 AM Views : 109

Studio18 News - జాతీయం / : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ తాను మైనర్‌ని అని కోర్టులో చెప్పాడు. తన వయసు 17 ఏళ్లు మాత్రమేనని చెప్పడంతో అతడికి బోన్ ఆసిఫికేషన్ టెస్ట్ చేసి వయసుని నిర్ధారించాలని కోర్టు ఆదేశించింది. కొన్ని ఎముకల ఎక్స్-రేను తీసుకోవడం ద్వారా ఈ టెస్టులో వయస్సును నిర్ధారిస్తారు. దీంతో ముంబై పోలీసులు నిందితుడు ధర్మరాజ్ కశ్యప్‌కు ఆసిఫికేషన్ టెస్ట్ నిర్వహించగా, అతను మైనర్ కాదని రుజువైనట్లు ఇవాళ ఒక అధికారి తెలిపారు. బాంద్రాలోని సబర్బన్‌లో బాబా సిద్ధిఖీని శనివారం ముగ్గురు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అందులో ఒకడే ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్. కేసులో శిక్షల నుంచి తప్పించుకోవడానికి అతడు తనను తాను మైనర్‌గా చెప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడు మైనర్‌ కాదని తెలియడంతో అతడిని కోర్టు అక్టోబరు 21 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ముంబై పోలీసులు హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేశ్‌ కశ్యప్ (19)ను అరెస్టు చేశారు. అయితే కాల్పుల సమయంలో సంఘటనా స్థలంలో ఉన్న మరో నిందితుడు తప్పించుకున్నాడు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :