Thursday, 12 March 2026 12:39:53 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Toll Free Entry: ముంబ‌యి వెళ్లే ఆ వాహ‌నాల‌కు నో టోల్ ఫీజు

Date : 14 October 2024 03:37 PM Views : 2554

Studio18 News - జాతీయం / : దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి వెళ్లే లైట్ మోటార్ వాహ‌నాల‌కు (LMV) మ‌హారాష్ట్ర స‌ర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక‌పై ముంబ‌యిలోకి ప్ర‌వేశించే మొత్తం ఐదు టోల్ బూత్‌ల వ‌ద్ద లైట్ మోటార్ వాహ‌నాల‌కు టోల్ ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని అక్క‌డి ఏక్‌నాథ్ షిండే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇవాళ్టి మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంది. నేటి అర్ధ‌రాత్రి నుంచే ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇక ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ములుంద్‌, తిన్హంత్‌, ద‌హిస‌ల్‌, వాషి, ఐరోలిలోని టోల్ బూత్‌ల వ‌ద్ద ఎస్‌యూవీలు, కార్లు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించ‌కుండానే న‌గ‌రంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉండ‌నుంది. ప్ర‌స్తుతం ఈ టోల్ ప్లాజాల‌లో రూ. 45 రుసుము వ‌సూలు చేస్తున్నారు. కాగా, మ‌రికొన్ని రోజుల్లో మ‌హారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఈ టోల్ ఫీజు మిన‌హాయింపు అంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఇంత‌కుముందు చాలాసార్లు టోల్ రుసుము వ‌సూళ్ల‌పై ఆందోళ‌న‌లు జ‌రిగాయి. అప్పుడు మ‌హా స‌ర్కార్ ప‌ట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి నో టోల్ ఫీజు అన‌డంతో ఇదంతా ఎన్నిక‌ల స్టంట్ అంటూ విపక్షాలు దుయ్య‌బ‌డుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :