Monday, 17 February 2025 04:05:42 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Toll Free Entry: ముంబ‌యి వెళ్లే ఆ వాహ‌నాల‌కు నో టోల్ ఫీజు

Date : 14 October 2024 03:37 PM Views : 652

Studio18 News - జాతీయం / : దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి వెళ్లే లైట్ మోటార్ వాహ‌నాల‌కు (LMV) మ‌హారాష్ట్ర స‌ర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక‌పై ముంబ‌యిలోకి ప్ర‌వేశించే మొత్తం ఐదు టోల్ బూత్‌ల వ‌ద్ద లైట్ మోటార్ వాహ‌నాల‌కు టోల్ ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని అక్క‌డి ఏక్‌నాథ్ షిండే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇవాళ్టి మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంది. నేటి అర్ధ‌రాత్రి నుంచే ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇక ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ములుంద్‌, తిన్హంత్‌, ద‌హిస‌ల్‌, వాషి, ఐరోలిలోని టోల్ బూత్‌ల వ‌ద్ద ఎస్‌యూవీలు, కార్లు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించ‌కుండానే న‌గ‌రంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉండ‌నుంది. ప్ర‌స్తుతం ఈ టోల్ ప్లాజాల‌లో రూ. 45 రుసుము వ‌సూలు చేస్తున్నారు. కాగా, మ‌రికొన్ని రోజుల్లో మ‌హారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఈ టోల్ ఫీజు మిన‌హాయింపు అంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఇంత‌కుముందు చాలాసార్లు టోల్ రుసుము వ‌సూళ్ల‌పై ఆందోళ‌న‌లు జ‌రిగాయి. అప్పుడు మ‌హా స‌ర్కార్ ప‌ట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి నో టోల్ ఫీజు అన‌డంతో ఇదంతా ఎన్నిక‌ల స్టంట్ అంటూ విపక్షాలు దుయ్య‌బ‌డుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :