Wednesday, 25 June 2025 08:06:41 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

India: 2036 నాటికి 152 కోట్లు దాటనున్న మన దేశ జనాభా

Date : 13 August 2024 01:26 PM Views : 119

Studio18 News - జాతీయం / : 2036 నాటికి భారతదేశ జనాభా 152.2 కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023' నివేదిక చెబుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతంగా ఉన్న మహిళల జనాభా 2036 నాటికి కాస్త మెరుగుపడి 48.8 శాతానికి చేరుకోనుందని పేర్కొంది. 2011తో పోలిస్తే 2036లో 15 ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న వారి నిష్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది. సంతానోత్పత్తి క్షీణతే ఇందుకు కారణంగా పేర్కొంది. 60 ఏళ్లు, అంతకు పైబడినవారి జనాభా నిష్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. 2011తో పోలిస్తే 2036 జనాభాలో మహిళల నిష్పత్తి కాస్త పెరుగుతుందని వెల్లడించింది. 2011లో 943గా ఉన్న మహిళల నిష్పత్తి 2036లో 952కు చేరుకోనుందని వెల్లడించింది. 2016 నుంచి 2020 వరకు 20-24 ఏళ్ల వారిలో సంతానోత్పత్తి శాతం 135.4 శాతం నుంచి 113.6 శాతానికి, 25-29 ఏళ్లున్న వారిలో 166 శాతం నుంచి 139.6 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 35-36 ఏళ్ల వయస్సు వారిలో 32.7 శాతం నుంచి 35.6 శాతానికి తగ్గింది. జీవితంలో స్థిరపడిన తర్వాతే సంతానం గురించి ఆలోచిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా ఈ నివేదిక తెలిపింది. 2020లో కౌమార సంతానోత్పత్తి రేటు నిరక్షరాస్యుల్లో 33.9 శాతం కాగా, అక్షరాస్యుల్లో 11 శాతంగా ఉంది. శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొంది. ఎప్పుడూ మగ పిల్లల కంటే ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ 2020కి వచ్చేసరికి ప్రతి 1000 మందిలో 28 మరణాలతో ఆడ, మగ సమానంగా నమోదయ్యాయి. 5 ఏళ్ల లోపు పిల్లల మరణాలు 2015లో 43గా ఉండగా, 2020 నాటికి 32కి తగ్గింది. డీపీఐఐటీ 2016 నుంచి 2023 వరకు 1,17,254 స్టార్టప్‌లను గుర్తించింది. ఇందులో 55,816 స్టార్టప్‌లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం గుర్తింపు పొందిన వాటిలో 47.6 శాతం మహిళలు ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :