Studio18 News - జాతీయం / : రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ సీఎం ఎవరో తేలిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి అతిశీ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ మంత్రివర్గ సమావేశంలో ఆమెను ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు. అతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఢిల్లీ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రి అతిశీనే కావడం గమనార్హం. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆమె కీలకంగా వ్యవహరించారు. సాయంత్రం తన సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను ఇవ్వనున్నారు.
Admin
Studio18 News