Wednesday, 04 March 2026 09:27:00 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Stock markets | స్టాక్‌ మార్కెట్స్‌లో బుల్‌ జోరు.. బలపడిన రూపాయి

Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. హెవీ వెయిట్ షేర్లలో స్థిరమైన కొనుగోళ్లు జరగడం, రూపాయి విలువ (

Date : 19 December 2025 07:11 PM Views : 137

Studio18 News - జాతీయం / : Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. హెవీ వెయిట్ షేర్లలో స్థిరమైన కొనుగోళ్లు జరగడం, రూపాయి విలువ (Rupee value) పుంజుకోవడం లాంటి అంశాలు సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండటంతో రోజంతా మార్కెట్లలో జోరు కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 447.55 పాయింట్లు లాభపడి 84,929 వద్ద స్థిరపడింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 25,966 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో మొదలైంది. ఒక దశలో 85,067.50 గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 25,993 వరకు వెళ్లింది. సెన్సెక్స్ స్టాక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 2 శాతానికిపైగా లాభపడి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఏషియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా రాణించాయి. మరోవైపు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు సుమారు 1 శాతం నష్టపోయింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లు కూడా నష్టాలతో ముగిశాయి. ప్రధాన సూచీలతో పోలిస్తే బ్రాడర్ మార్కెట్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు చెరొక 1.3 శాతం పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.25 వద్ద ముగియడం కూడా మార్కెట్లకు అదనపు బలాన్నిచ్చింది. ఇటీవలి రికవరీని బట్టిచూస్తే వచ్చే వారం ‘శాంటా ర్యాలీ’కి అవకాశం కనిపిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :