Wednesday, 16 July 2025 11:49:58 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Bomb Threat: స్కూల్లో బాంబు ఉందని మెయిల్ పంపిన బాలుడు.. ఎందుకో తెలుసా?

Date : 03 August 2024 04:04 PM Views : 156

Studio18 News - జాతీయం / : స్కూల్‌కి వెళ్లకూడదని అనుకుంటే కడుపునొప్పి వస్తుందనో, జ్వరం వచ్చిందనో చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు పిల్లలు. ఓ బాలుడు మాత్రం స్కూల్‌కి వెళ్లకూడదని ప్లాన్ వేసుకుని పాఠశాలలో బాంబు ఉందంటూ మెయిల్ పంపి, బడి సిబ్బందిని, పోలీసులను పరుగులు పెట్టించాడు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్-1లోని కైలాశ్ కాలనీలో సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్‌ ఉంటుంది. పాఠశాలను బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో వెంటనే స్కూలు ఆవరణను ఖాళీ చేయించారు. 10 నిమిషాల్లో క్లాసుల నుంచి విద్యార్థులను పంపించేశామని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ షాలినీ అగర్వాల్ తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు 14 ఏళ్ల విద్యార్థిని గుర్తించి విచారిస్తున్నారు. విద్యార్థికి పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేకే ఇటువంటి పని చేశాడని పోలీసులు తెలిపారు. విద్యార్థి అతడు చదివే స్కూలుతో పాటు మరో రెండు పాఠశాలల పేర్లనూ మెయిల్‌లో పేర్కొన్నాడని తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం ఢిల్లీలోని 131 పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిల్‌లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలుడు కూడా అటువంటి ఈ-మెయిలే పంపడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :