Monday, 23 June 2025 02:34:54 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Supreme Court: సెక్షన్ 306ను అమలు చేయాలంటే ఆత్మహత్యకు పురికొల్పినట్టు ఆధారాలుండాలి: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Date : 21 August 2024 11:37 AM Views : 124

Studio18 News - జాతీయం / : ఓ వ్యక్తి ఆత్మహత్యకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించే నిబంధన అమలు చేయాలంటే నిందితుడు బాధిత వ్యక్తిని ఆత్మహత్యకు పురికొల్పి ఉండడమో, ఇతరులతో కలిసి కుట్రలో పాలుపంచుకోవడమో, లేదంటే నేరం చేసిన వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా సాయం చేసి ఉండడమో చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తన భర్త ఆత్మహత్య విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయడం కుదరదంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ రోహిణి సుదర్శన్ గంగుర్డే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ ఆదేశాలను సమర్ధించడంపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు అనుమతించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సతీశ్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఓ ఆసుపత్రిలో సామాజిక సేవా సూపరింటెండెంట్‌గా పనిచేసిన 38 ఏళ్ల సుదర్శన్ గంగుర్డే 17 ఫిబ్రవరి 2020న శింగనాపూర్‌లోని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. మానసికంగా, శారీరకంగా వేధించడం, కొట్టడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న సుదర్శన్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు కుటుంబాలకు ఇష్టం లేకున్నా సుదర్శన్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మగబిడ్డ కూడా జన్మించాడు. ఆ తర్వాత ఉమ్మడిగా వారు ఓ ఇల్లు కూడా కొనుగోలు చేశారు. ఆ ఇంటిని తన పేరున మార్చమని భార్య బాధితుడిని వేధించిందని, అతడి ఆత్మహత్యకు అదే కారణమని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఆ ఆరోపణల్లో నిజం లేదని, భర్తను ఆత్మహత్యకు పురికొల్పేలా చేసినట్టు ఆధారాలు లేవని రోహిణి వాదించింది. తాముండే ఇంటిని ఉమ్మడిగా కొనుగోలు చేయడంతో దానిని తన పేరున బదిలీ చేయాలని బలవంతం చేశామన్న ప్రశ్నే లేదని పేర్కొంది. అయితే, సాక్ష్యాలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయని అభిప్రాయపడిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రోహిణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. మరణించిన వ్యక్తి వైవాహిక జీవితంలో ఎలాంటి వివాదాలు లేవని, ఆయన ఆత్మహత్యకు, వైవాహిక బంధానికి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం లేదని స్పష్టం చేసింది. భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు నిరూపించే ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :