Wednesday, 16 July 2025 11:46:41 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Rahul Gandhi: సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. స్పందించిన రాహుల్ గాంధీ

Date : 12 August 2024 12:14 PM Views : 128

Studio18 News - జాతీయం / : అదానీ గ్రూప్‌కు సంబంధించిన ఆఫ్‌షోర్ ఫండ్లలో సెబీ చైర్‌పర్సన్ మాధబి పురి బచ్, ఆమె భర్తకు వాటాలున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. సెబీ సమగ్రత దారుణంగా దెబ్బతిందని కామెంట్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఆరోపణల నిగ్గు తేల్చే దిశగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసేందుకు మోదీ ఎందుకు భయపడుతున్నారో హిండెన్‌బర్గ్ నివేదిక తేటతెల్లం చేస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘చిన్న మదుపర్ల సంపదకు రక్షణగా నిలవాల్సిన సెబీ సమగ్రత దెబ్బతింది. సెబీ చీఫ్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని మదుపర్లు ప్రశ్నిస్తున్నారు. వారు కష్టపడి సంపాదించుకున్న డబ్బు పోతే ఎవరు బాధ్యులు? సెబీ చైర్‌పర్సన్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయట్లేదు? హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. మరి సుప్రీం కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా పరిశీలిస్తుందా? అసలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేందుకు ప్రధాని ఎందుకు జంకుతున్నారో ఈ ఆరోపణలతో స్పష్టమైంది. కమిటీ ఏయే అంశాలు వెలికి తీస్తుందో అన్న ఆందోళన కావచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. కాగా, హిండెన్‌బర్గ్ ఆరోపణలను కుట్రగా బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఆర్థిక అస్థిరత్వాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నాయని మండిపడింది. సెబీ విశ్వసనీయత దెబ్బతీసేందుకు హిండెన్‌బర్గ్ ఈ ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. ‘‘గతేడాది అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌‌ విషయంలో భారత ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో కుట్రకోణం సుస్పష్టం. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు వల్లెవేస్తున్నాయి. దేశ ఆర్థిక రంగంలో అస్థిరత్వం, అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశూ త్రివేదీ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :