Wednesday, 16 July 2025 10:33:20 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

మహిళలకు రూ.2500 స్కీమ్ ప్రారంభోత్సవం.. డబ్బులు అకౌంట్ లో ఎప్పటి నుంచి పడతాయంటే..

అర్హులైన మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం నెలకు రూ.2500 అందించనుంది.

Date : 08 March 2025 03:56 PM Views : 112

Studio18 News - జాతీయం / : Mahila Samriddhi Yojana: ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది. ఈ పథకం కింద ఢిల్లీలోని అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.2500 అందించనున్నారు. Mahila Samriddhi Yojana: ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది. ఈ పథకం కింద ఢిల్లీలోని అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.2500 అందించనున్నారు. ఢిల్లీలో గత నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అధికారంలోకి రాగానే మహిళా సమృద్ధి యోజన కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ. 2500 అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే, ఈ పథకంకు అర్హత పొందాలంటే.. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించని మహిళలు, పన్ను చెల్లించని వారు ఈ పథకంకు అర్హులు. ఢిల్లీలో ఐదు సంవత్సరాల నుంచి నివసిస్తున్న మహిళలు ఈ పథకం ప్రయోజనాలు పొందుతారు.

ఈ పథకంకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్ లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తెస్తామని, అర్హత కలిగిన అభ్యర్థులను గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఈ పథకంకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, చిరునామా, రిజిస్టర్ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతున్న మహిళా సమృద్ధి యోజన పథకం ద్వారా 15 నుంచి 20 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తరువాత పథకం ప్రయోజనాలను అందించే తేదీని ప్రకటించడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ మార్చి 8న ప్రారంభమవుతుందని, అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తామని, ఆ తర్వాత ఆర్థికంగా పేద ప్రతి మహిళకు రూ.2,500 అందించే మొత్తం ప్రక్రియ ఒకటిన్నర నెలల్లో పూర్తవుతుందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :