Saturday, 07 March 2026 09:10:19 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

జమ్మూకశ్మీర్ ఎన్నికలు.. ఇండియా కూటమిలో పార్టీల మధ్య కుదిరిన పొత్తు.. కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలంటే?

Date : 27 August 2024 02:15 PM Views : 361

Studio18 News - జాతీయం / : Jammu and Kashmir Elections 2024 : జమ్మూకశ్మీర్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు తేదీలనుసైతం ప్రకటించింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. మరోవైపు.. బీజేపీ అధిష్టానం తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి 44 మంది అభ్యర్థుల పేర్లను సోమవారం ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. త్వరలో ఇండియా కూటమి పార్టీలు కూడా తమతమ పార్టీల అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 50 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయనుంది. 32 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనుండగా.. సీపీఐ(ఎం), జమ్మూకశ్మీర్ పాంథర్స్ పార్టీ చెరొక స్థానంలో పోటీ చేయనున్నాయి. మిగిలిన ఆరు స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి ఇండియా కూటమిలోని పార్టీలు నిర్ణయించాయి. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, గులాం నబీ ఆజాద్ కు చెందిన డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఆప్ అధిష్టానం ఇప్పటికే ఏడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేయడం ఇదే తొలిసారి. మరోవైపు డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జమ్మూకశ్మీర్ లో మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తొలి దశలో (సెప్టెంబర్ 18న) 24 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో (సెప్టెంబర్ 25న) 26 స్థానాలకు, మూడో దశలో (అక్టోబర్ 1న) 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :