Monday, 08 December 2025 03:32:46 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

ఒక్కరోజు నా స్థానంలో కూర్చుంటే తెలుస్తుంది..! సుప్రీంకోర్టు న్యాయవాదులపై సీజేఐ తీవ్ర అసహనం

Date : 06 August 2024 01:42 PM Views : 270

Studio18 News - జాతీయం / : Chief Justice DY Chandrachud : పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు, న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో కనీసం అర్థం చేసుకోవాలని అన్నారు. న్యాయవాదులు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే ఎంత ఒత్తిడితో పని చేస్తున్నామో అని తెలుస్తుందని అన్నారు. ఒక్కసారి కూర్చుంటే మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారుని సీజేఐ వ్యాఖ్యానించారు. ముంబై చెంబుర్‌ కాలేజీలో విద్యార్ధినిలు బురఖా, హిజాబ్‌ రద్దు చేసిన వ్యవహారంపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కానీ, న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరని సీజేఐ అన్నారు. ప్రతిఒక్క పిటిషన్‌పై విచారణ చేస్తాము.. దానికి ఒక తేదీ ఇస్తాము.. కానీ న్యాయమూర్తులను, కోర్టును శాసించవద్దు అంటూ జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. ఏక్ నాథ్ షిండే గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి మహారాష్ట్ర స్పీకర్ నిరాకరించినందుకు వ్యతిరేకంగా శివసేన (యుబిటి) దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలని న్యాయవాది కోరారు. ఈరోజు ఈ అంశం జాబితా చేయబడినప్పటికీ ధర్మాసనం పాక్షికంగా విని మరో అంశాన్ని విచారిస్తున్నందున అది తీసుకోలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ముందస్తు విచారణ తేదీ కావాలని న్యాయవాది అభ్యర్థించారు. ప్రతివాదులు డాక్యుమెంట్ల సంకలనానికి సమయం కావాలని కోరడంతో కోర్టు వచ్చే గురువారం వరకు గడువు ఇచ్చింది. మూడు రోజుల్లో సంకలనాన్ని రూపొందించవచ్చునిన న్యాయవాది ముందస్తు తేదీ కోరినప్పుడు సీజేఐ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :