Saturday, 07 March 2026 08:24:35 PM
# కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా

ఆ ముగ్గురు నిందితులకు 7 రోజుల ట్రాన్సిట్‌ రిమాండ్‌

రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన నిందితుల్లో ముగ్గురికి మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ లోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ జడ్జి 7 రోజుల ట్రాన్సిట

Date : 09 June 2025 08:44 PM Views : 304

Studio18 News - జాతీయం / : రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన నిందితుల్లో ముగ్గురికి మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ లోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ జడ్జి 7 రోజుల ట్రాన్సిట్‌ రిమాండ్‌ విధించారు. దాంతో నిందితులు ముగ్గురిని షిల్లాంగ్‌ పోలీసులు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు తీసుకెళ్లి విచారించనున్నారు. కేసులో నాలుగో నిందితుడిని బినా జిల్లాలోని సాగర్‌ ఏరియా నుంచి ఇండోర్‌కు తీసుకొస్తున్నారు. ఇండోర్‌కు చేరుకోగానే అతడిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. అతడికి కూడా 7 రోజుల ట్రాన్సిట్‌ రిమాండ్‌ విధించే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసులు నలుగురిని షిల్లాంగ్‌కు తరలించనున్నారు. నిందితులు ఆకాశ్‌ రాజ్‌పుత్, విశాల్‌ సింగ్‌ చౌహాన్‌, రాజ్‌సింగ్‌ కుశ్వాహలకు ట్రాన్సిట్‌ రిమాండ్‌ విధించగా.. మరో నిందితుడు ఆనంద్‌ను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. మరోవైపు యూపీలోని ఘాజీపూర్‌లో లొంగిపోయిన సోనమ్‌ రఘువంశీని పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం ఘాజీపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను కూడా షిల్లాంగ్‌ కు తరలించనున్నారు. సోనమ్‌ రఘువంశీనే కిరాయి హంతకులను పెట్టి భర్తను హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రాజా రఘువంశీ, సోనమ్‌ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే 23 నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్‌ 2న ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. సోనమ్‌ జాడ తెలియలేదు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఆమె ఘాజీపూర్‌లో లొంగిపోయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :