Wednesday, 25 June 2025 08:04:04 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై పిటిషన్ కొట్టివేత

Date : 08 May 2025 12:47 PM Views : 53

Studio18 News - జాతీయం / : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. గతంలో నమోదైన పరువునష్టం కేసులో శిక్ష పడటం, ఆయన పౌరసత్వానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నలను కారణంగా చూపుతూ ఈ పిటిషన్ దాఖలైంది. అయితే, పిటిషనర్ వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ పౌరసత్వం ఆధారంగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు ఎలాంటి బలమైన, అధికారిక ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందుంచలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. "ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసేంతటి స్పష్టమైన ఆధారాలేవీ మా ముందు ఉంచలేదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, రాహుల్ గాంధీ పార్లమెంటరీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేదని కూడా హైకోర్టు ప్రస్తావించింది. ఈ విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించిన అంశాన్ని ముగించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కాలపరిమితి నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేయలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక పరువునష్టం కేసుకు సంబంధించిన శిక్షపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే విధించిందని, అందువల్ల, రాహుల్ గాంధీ పదవిలో కొనసాగే అర్హతను సవాలు చేస్తూ (కో వారంటో రిట్) దాఖలు చేసిన పిటిషన్‌కు బలం చేకూరదని న్యాయస్థానం అభిప్రాయపడింది. "అనర్హతకు సంబంధించిన ఆరోపణలపై ఇప్పటికే ఉన్నత న్యాయస్థానం రక్షణ కల్పించిన నేపథ్యంలో ఈ కోర్టు అలాంటి ఉపశమనంపై విచారణ చేపట్టదు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. శిక్షకు సంబంధించిన ప్రధాన అభ్యర్థనను పిటిషనర్ స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారని, అందుకే ఆ పిటిషన్ భాగాన్ని "విచారణకు పట్టుబట్టడం లేదు" (నాట్ ప్రెస్డ్)గా పరిగణించి కొట్టివేస్తున్నట్లు కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తుల వల్ల ఎలాంటి స్పష్టమైన ఫలితం రాలేదని కోర్టు గమనించింది. అయితే, ఇప్పటికే చేసిన చట్టబద్ధమైన విజ్ఞప్తి ఏదైనా ఉంటే, దానిని సంబంధిత అధికారం చట్ట ప్రకారం పరిశీలించవచ్చని స్పష్టం చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :