Wednesday, 16 July 2025 10:39:43 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Siddaramaiah: కర్ణాటక సీఎంకు గవర్నర్ నోటీసులు .. కీలక నిర్ణయాన్ని తీసుకున్న క్యాబినెట్

Date : 02 August 2024 01:40 PM Views : 134

Studio18 News - జాతీయం / : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడాన్ని కర్ణాటక క్యాబినెట్ తప్పుబట్టింది. మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) సంస్థ ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో సీఎం సిద్ద రామయ్యకు గవర్నర్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడం కర్ణాటక రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ద రామయ్య లేకుండానే డిప్యూటి సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన నిన్న విధాన సౌధలో క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ జారీ చేసిన నోటీసులపై క్యాబినెట్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ముడా అవినీతికి సంబంధించి జారీ చేసిన నోటీసులను గవర్నర్ వెనక్కు తీసుకోవాలని క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. క్యాబినెట్ భేటీ అనంతరం సహకార శాఖ మంత్రి రాజణ్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ భవన్ నుండి సీఎం సిద్దరామయ్యకు వచ్చిన నోటీసులపై చర్చించామని, దీనిపై న్యాయపోరాటం చేయాలని తీర్మానించడం జరిగిందని చెప్పారు. సీఎంకి నోటీసులు జారీ చేయడం రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. నోటీసులు తిరస్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ అంశం ఇప్పుడు కన్నడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :