Thursday, 22 May 2025 02:54:19 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

టార్గెట్ 2026.. ఏడాది తరువాత అమిత్ షా సమీక్ష.. హాజరుకానున్న సీఎం రేవంత్

Date : 07 October 2024 11:39 AM Views : 135

Studio18 News - జాతీయం / : Amit Shah Review Meeting With CMs: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో ఇవాళ సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏడాది తరువాత సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, సీఎస్ లు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, పలు కీలక శాఖల కార్యదర్శులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పాల్గోనున్నారు. 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా సమీక్ష జరగనుంది. దేశంలో మావోయిస్టు సమస్యను లేకుండా చేయడమే ప్రస్తుత లక్ష్యం అని ఇప్పటికే అమిత్ షా ప్ర‌క‌టించారు. మావోయిస్టుల కట్టడి, కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అమిత్ షా నిర్వహించే సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నుంచి హోంమంత్రి అనిత, ఇరు రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలు హాజరు కానున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్, కేరళ రాష్ట్రాల మంత్రులు, అధికారులు కూడా హాజరుకానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం ఉన్న భద్రత సమస్య నుంచి ఆ ప్రాంతాలకు విముక్తి కల్పించడం, సమాచార వ్యవస్థ ను నెలకొల్పడం, ఆయా ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు కేంద్రం నుంచి చేపట్టే కార్యక్రమాల వివరాలను ఆయా శాఖల కేంద్ర మంత్రులు రాష్ట్రాలకు వివరించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం చేపట్టిన ఆపరేషన్, సాయుధ బలగాల కార్యాచరణ, బలగాల మోహరింపు వివరాలు ఇంటిలిజెన్స్ అధికారులు అందజేయనున్నారు. ఈ సమీక్ష సమావేశంకు కేంద్ర ఆరోగ్య, ఉక్కు, గ్రామీణాభివృద్ధి, గిరిజన వ్యవహారాలు, టెలీకమ్యూనికేషన్లు, తపాలా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శులతోపాటు ఆయా శాఖల మంత్రులు కూడా అందుబాటులో ఉండాలని కేంద్ర హోంశాఖ నుంచి ఇప్పటికే సమాచారం వెళ్లింది. ఇంటిలిజెన్స్, సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్, ఐటిబిపి డైరెక్టర్లు, జాతీయ భద్రతా సలహాదారు కూడా ఈ సమావేశంకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంకు కేరళ సీఎం, అధికారులు హాజరు కావాలని కేంద్ర హోంశాఖ ఆహ్వానించింది. గత కొన్నేళ్లు మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వ్యూహంతో ఇప్పటికే వామపక్ష తీవ్రవాదం 72శాతం తగ్గింది. హింసాత్మక ఘటనలు తగ్గడంతోపాటు 86శాతం మరణాలు తగ్గాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 202 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2026 నాటికి నక్సల్స్ ప్రభావాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు కేంద్రం టార్గెట్ పెట్టుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :