Sunday, 15 March 2026 10:35:54 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Bomb Threats: 24 గంటల్లో ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు.. ఒకటి ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లింపు

Date : 19 October 2024 01:38 PM Views : 450

Studio18 News - జాతీయం / : విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా ఐదు విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో విమానాలను మళ్లించడం, అత్యవసర ల్యాండింగ్ చేయించడం జరిగింది. బాంబు బెదిరింపులు అందుకున్న ఐదు విమానాల్లో మూడు విస్తారా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఈ ఉదయం వీటికి బెదిరింపులు వచ్చాయి. అయితే, ఇవన్నీ ఉత్తిత్తి బెదిరింపులేనని తేలింది. బాంబు బెదిరింపు అందుకున్న ఢిల్లీ-లండన్ విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడ తనిఖీల అనంతరం బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలడంతో విమానం తిరిగి బయలుదేరింది. అలాగే, దుబాయ్ నుంచి 189 మంది ప్రయాణికులతో జైపూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి కూడా ఈమెయిల్ ద్వారా ఇలాంటి బెదిరింపే వచ్చింది. నిన్న బెంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఆకాశ్ ఎయిర్ విమానానికి టేకాఫ్‌కు ముందు ఇలాంటి బెదిరింపే వచ్చింది. కాగా, గత వారం రోజుల్లో ఏకంగా 20 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఒక్క రోజే ఐదు బెదిరింపులు వచ్చాయి. అయితే, అన్నీ ఉత్తవేనని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ‘బాంబ్స్’, ‘బ్లడ్ విల్ స్ప్రెడ్ ఎవరీవేర్’, ‘ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్’, ‘దిస్ ఈజ్ నాటే జోక్’, ‘యు విల్ డై’, ‘బాంబ్ రఖ్వా దియా హై’ అని చెబుతూ నిందితులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి కేసులోనే ముంబైకి చెందిన 17 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి కాల్స్ చేసే వారిపై కఠిన చర్యలకు పౌర విమానయానశాఖ సిద్ధమవుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :