Wednesday, 16 July 2025 11:55:55 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

సంపన్నుల కోసం ప్రజాస్వామ్యం ఎదురుచూడాల్సిందే.. హర్ష్ గోయెంకా సెటైరికల్ ట్వీట్

మలబార్ హిల్స్ లోని సెలబ్రిటీలు ఓటేయకపోవడంపై విమర్శ పోలింగ్ బూత్ వద్ద వాలెట్ పార్కింగ్ కోసం చూస్తారని వ్యంగ్యం సాధారణ జనంతో క్యూలో వెళ్లి ఓటే

Date : 20 November 2024 01:17 PM Views : 166

Studio18 News - జాతీయం / : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సెలబ్రిటీలను ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఓటేయడానికి వెళ్లాలంటే మలబార్ హిల్స్ లోని సంపన్నులకు ఎక్కడలేని విసుగని, పోలింగ్ బూత్ వద్ద వాలెట్ పార్కింగ్ ఉందా? లేదా? అని ఆలోచిస్తారని విమర్శించారు. మనీశ్ మల్హోత్రా తన ఔట్ ఫిట్ కు సూటయ్యే కళ్ల జోడు కోసం వెతికేంత వరకూ ప్రజాస్వామ్యం వేచి ఉండాల్సిందేనని అన్నారు. ఇక, పోలింగ్ కేంద్రానికి బెంజ్ లో వెళ్లాలా? లేక బీఎండబ్ల్యూలో వెళ్లాలా? అనేది వారికి ఎదురయ్యే అతి పెద్ద సమస్య అని ఎద్దేవా చేశారు. పోలింగ్ బూత్ వద్ద సామాన్యులతో కలిసి క్యూలో వెళ్లి ఓటేయడాన్ని వారు నామోషీగా భావిస్తుంటారని హర్ష్ గోయెంకా మండిపడ్డారు. ఈ సమస్యలను తప్పించుకోవడానికి వారు ఓటేయడమే మానుకుంటారని తీవ్రంగా విమర్శించారు. ముంబైలో పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ప్రతిసారీ అతి తక్కువ పోలింగ్ నమోదవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైతో పాటు పూణె, నాగ్ పూర్ వంటి నగరాల్లోనూ సగటు పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదవుతుందన్నారు. కాగా, బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొమ్మిది గంటల వరకు అంటే.. తొలి రెండు గంటల్లో కేవలం 6.61 శాతం పోలింగ్ మాత్రమే నమోదైందని అధికారులు వెల్లడించారు.

Also Read : దర్గాను సందర్శించిన రామ్ చరణ్‌పై విమర్శలు.. దీటుగా బదులిచ్చిన ఉపాసన

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :