Wednesday, 16 July 2025 11:20:33 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

హనీమూన్ జంట మిస్సింగ్: ఫోన్ లో సోనమ్ చివరిగా అత్తగారితో మాట్లాడిన మాటలు ఇవే!

Date : 04 June 2025 05:23 PM Views : 39

Studio18 News - జాతీయం / : "అత్తయ్యా... మేం ఇప్పుడు అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్నాం, ఇక్కడో జలపాతం ఉందంట, అది చూడ్డానికి వెళుతున్నాం. మళ్ళీ కాల్ చేస్తాను," ఇవి మేఘాలయలో అదృశ్యమైన సోనమ్ తన అత్తగారితో చివరిసారిగా పలికిన మాటలు. ఏకాదశి కావడంతో ఉపవాసం ఉంటున్న కోడలి యోగక్షేమాలు తెలుసుకుందామని ఫోన్ చేసిన రాజా తల్లికి, ఆ తర్వాత సోనమ్ నుంచి పిలుపు అందలేదు, ఆ జంట ఆచూకీ గల్లంతైంది. కొద్దిరోజుల తర్వాత, వైసాడాంగ్ జలపాతం సమీపంలోని లోయలో ఆమె భర్త రాజా రఘువంశీ దారుణ హత్యకు గురైన మృతదేహాన్ని కనుగొనగా, సోనమ్ ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ హృదయవిదారక ఘటన ఇండోర్, మేఘాలయ ప్రాంతాల్లో కలకలం రేపింది. ఇండోర్‌కు చెందిన నవ దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ మే 23న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అదే రోజు వారి ఆచూకీ తెలియరాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, జూన్ 2న వైసాడాంగ్ జలపాతం వద్ద లోయలో రాజా మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. దంపతులు అదృశ్యం కావడానికి కొద్దిసేపటి ముందు సోనమ్‌తో చివరిసారిగా మాట్లాడిన విషయాన్ని రాజా తల్లి కన్నీటిపర్యంతమవుతూ గుర్తుచేసుకున్నారు. "మే 23న ఏకాదశి. కోడలు ఉపవాసం ఉంటుందని తెలుసు. ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేశాను. నడక ప్రయాణంలో ఉన్నారు కదా, ఏదైనా తినమని చెప్పాను. దానికి సోనమ్, 'విహారయాత్రకు వచ్చానని ఉపవాసం ఎలా మానేస్తాను అత్తయ్యా' అంది. అడవిలో ఒక జలపాతం చూడటానికి ట్రెక్కింగ్ చేస్తున్నామని, కాస్త ఆయాసంగా అనిపిస్తోందని, తర్వాత కాల్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత వాళ్ల నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు" అని ఆమె విలపించారు. ఈ సంభాషణకు సంబంధించిన రికార్డింగ్‌ను కుటుంబ సభ్యులు పోలీసులతో పంచుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :