Monday, 23 June 2025 02:33:19 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

ఢిల్లీలో విషాద ఘటన.. మ్యాన్‌హోల్‌లోపడి తల్లీ, కొడుకు మృతి.. మరణంలోనూ కొడుకు చేతిని వదలని తల్లి

Date : 01 August 2024 01:49 PM Views : 174

Studio18 News - జాతీయం / : New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 23ఏళ్ల మహిళ, ఆమె మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. ఈ విషాద ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఘాజీపూర్ లోనూ రహదారిపై నీరు చేరింది. వర్షం పడిన సమయంలో తనూజ బిష్త్ అనే మహిళ తన మూడేళ్ల ప్రియాంష్ తో కలిసి ఘాజీపూర్ లోని వారాంతపు సంతకు వెళ్లింది. సంతలో సరుకులు తీసుకొని వస్తున్న క్రమంలో రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో రోడ్డుపై మ్యాన్ హోల్ తెరుచుకొని ఉండటంతో దానిని గమనించని మహిళ మూడేళ్ల చిన్నారితో కలిసి అందులో పడిపోయింది. అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ద్వారా తల్లీ, కుమాడ్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే వారు మరణించారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన గంట తరువాత రెండు మృతదేహాలను మ్యాన్ హోలో పడిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో గుర్తించారు. అప్పటికీ తల్లి తన కొడుకు చేతిని పట్టుకొని ఉంది. తన బిడ్డను కాపాడుకొనేందుకు ఆమె ఎంతస్థాయిలో ప్రయత్నించిందో ఈ ఘటనను చూస్తే అర్థమవుతుంది. గత మూడు నెలలుగా ఈ డ్రెయిన్ తెరిచి ఉందని, పలుసార్లు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్ మూసి ఉంటే తల్లీ, బిడ్డ ఇద్దరూ బతికిఉండేవారని స్థానికులు తెలిపారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వారిద్దరూ మరణించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :