Wednesday, 25 June 2025 07:05:37 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

ఘాజీపూర్‌ జిల్లా ఆస్పత్రిలో సోనమ్‌ రఘువంశీకి వైద్య పరీక్షలు.. Video

మేఘాలయ (Meghalaya) హనీమూన్‌ ట్రిప్‌లో భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్‌ రఘువంశీ (Sonam Raghuvanshi) ని

Date : 09 June 2025 08:45 PM Views : 40

Studio18 News - జాతీయం / : మేఘాలయ (Meghalaya) హనీమూన్‌ ట్రిప్‌లో భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్‌ రఘువంశీ (Sonam Raghuvanshi) ని వైద్యపరీక్షల నిమిత్తం పోలీసులు ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని ఘాజీపూర్‌ (Ghazipur) జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం మేఘాలయ పోలీసులు ఆమెను తదుపరి దర్యాప్తు కోసం మేఘాలయకు తీసుకెళ్లనున్నారు. సోనమ్‌ రఘువంశీ తన భర్త హత్యకు గురైన 18 రోజుల తర్వాత సోమవారం తెల్లవారుజామున ఘాజీపూర్‌లోని ఓ దాబా వద్దకు చేరుకుని పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు ఆమెను ఘాజీపూర్‌లోనే ఓ ఇంట్లో నిర్బంధించారు. అనంతరం మేఘాలయ నుంచి ఓ పోలీస్‌ బృందం ఘాజీపూర్‌కు చేరుకుంది. సోనమ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించింది. పరీక్షల అనంతరం ఆమెను మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు తీసుకెళ్లనున్నారు. రాజా రఘువంశీ, సోనమ్‌ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే 23 నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్‌ 2న ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. సోనమ్‌ జాడ తెలియలేదు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఆమె ఘాజీపూర్‌లో లొంగిపోయింది. దాంతో సోనమే కిరాయి హంతకులతో తన భర్తను హత్య చేయించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :