Thursday, 15 May 2025 03:13:04 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Railway Trackman: ఐదు నిమిషాల్లో అర కిలోమీటరు పరుగెత్తి రాజధాని ఎక్స్ ప్రెస్ కు ప్రమాదాన్ని తప్పించాడు!

Date : 08 September 2024 11:48 AM Views : 101

Studio18 News - జాతీయం / : అతను రైల్వే శాఖలో ఓ చిరుద్యోగి. కానీ అతను రాబోతున్న ఓ పెద్ద ప్రమాదాన్ని గుర్తించి అపగలిగాడు. వందలాది మంది ప్రయాణీకులు ప్రమాదం బారిన పడకుండా కాపాడాడు. విధి నిర్వహణలో అతను చూపిన సమయస్పూర్తి, తెగువను ఉన్నతాధికారులు గుర్తించడంతో పాటు నగదు పురస్కారంతో సత్కరించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ట్రాక్ మ్యాన్ మహాదేవ తన విధి నిర్వహణలో భాగంగా కొంకణ్ రైల్వే డివిజన్ లోని కుమ్టా, హోన్నావర్ స్టేషన్ మధ్య తనిఖీలు నిర్వహిస్తుండగా, వేకువజామున 4.50 గంటల ప్రాంతంలో ఓ ప్రదేశంలో రైలు పట్టాల జాయింట్ వద్ద వెల్డింగ్ అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించాడు. అప్పటికే ఆ మార్గంలో తిరువనంతపురం – ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ వస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన మహాదేవ .. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని కుమ్టా స్టేషన్ కు సమాచారం అందించాడు. అయితే అప్పటికే రైలు ఆ స్టేషన్ ను దాటేసింది. దీంతో నేరుగా రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్ లోకో పైలట్ ను నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించగా, అదీ విఫలమైంది. దీంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మహదేవ ..ఆ రైలును ఆపేందుకు పట్టాల వెంట ఎదురుగా పరుగు తీశాడు. ఐదు నిమిషాల వ్యవధిలో అర కిలోమీటరు మేర పరిగెత్తి ..లోకో పైలట్ కు సిగ్నల్ ఇచ్చాడు. మహాదేవ ఇచ్చిన రెడ్ సిగ్నల్ తో లోకో పైలట్ రైలును నిలుపుదల చేశాడు. అనంతరం రైల్వే ట్రాక్ పై వెల్డింగ్ పనులు పూర్తి అయిన తర్వాత రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది. వందలాది మంది రైల్వే ప్రయాణీకుల భద్రత కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధి నిర్వహణ చేసిన మహాదేవను రైల్వే ఉన్నతాధికారులు హీరోగా ప్రశంసించారు. అంతే కాకుండా మహాదేవను సత్కరించి రూ.15వేల నగదు పురస్కారాన్ని కూడా అందించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :