Thursday, 15 May 2025 02:03:50 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

uddhav sena: మహా వికాస్ అఘాడీలో కుదిరిన సీట్ల సర్దుబాటు.. సీట్ల షేరింగ్ ఇలా..!

Date : 24 October 2024 11:29 AM Views : 140

Studio18 News - జాతీయం / : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంపకంపై ఒక స్పష్టత వచ్చింది. కూటమిలోని మూడు ప్రధాన పార్టీలు.. ఉద్దవ్ ఠాక్రే శివసేన (యూబీడీ), కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్) పార్టీలు సమానంగా సీట్లు పంచుకున్నాయి. రాష్ట్రంలోని 288 సీట్లకు గానూ ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించాయి. మిగిలిన 33 సీట్లలో కూటమిలోని చిన్న మిత్రపక్షాలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరక గత కొన్ని రోజులుగా ఎంవీఏ కూటమిలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. శివసేన ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్‌కి మద్య చిన్నపాటి మాటల యుద్ధం కూడా నడిచింది. విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి ఠాక్రే వర్గం మరో ఎనిమిది సీట్ల కోసం పట్టుబట్టింది. మొత్తంగా యూబీటీ 17 సీట్లను కాంగ్రెస్ నుంచి కోరడంతో సీట్ షేరింగ్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో సీట్ల షేరింగ్‌ వివాదానికి తెరపడినట్లు భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే శివసేన ఠాక్రే వర్గం 65 మందితో అభ్యర్ధుల తొలి జాబితాను రిలీజ్ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :