Wednesday, 16 July 2025 11:03:29 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఆయన గో మాంసం, ఈయనేమో పంది మాంసం తినేవారంటూ కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్

Date : 03 October 2024 05:14 PM Views : 139

Studio18 News - జాతీయం / : వి.డి సావర్కర్ మాంసాహారేనని, ఆయనేమీ గోహత్యకు వ్యతిరేకం కాదని కాంగ్రెస్ నేత, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దినేశ్ గుండూరావు మాట్లాడారు. సావర్కర్ ఇతర మాంసాహారం మాత్రమేగాక గో మాంసం కూడా తినేవారని, అంతేగాక ఆ పద్ధతిని బహిరంగంగా ప్రచారం చేశారని చెప్పారు. సావర్కర్ బ్రాహ్మణుడేనని, అయినప్పటికీ ఆయన సంప్రదాయంగా వచ్చే ఆహార అలవాట్లను పాటించలేదని తెలిపారు. సావర్కర్‌ ఈ విషయంలో ఓ ఆధునిక వాది అని గుండూరావు చెప్పారు. మహాత్మా గాంధీ ప్రజాస్వామ్యాన్ని నమ్మితే, సావర్కర్ మాత్రం మతవాదాన్ని నమ్ముకున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ హిందూ సాంస్కృతిక సంప్రదాయవాదంపై ప్రగాఢ నమ్మకంతో కఠినమైన శాకాహార పద్ధతుల్ని పాటించేవారని తెలిపారు. సావర్కర్‌పై మాత్రమే కాకుండా మహ్మద్ అలీ జిన్నా గురించి కూడా గుండూరావు మాట్లాడుతూ… జిన్నా మరో విధమైన తీవ్రవాదానికి ప్రాతినిధ్యం వహించాడని అన్నారు. జిన్నా తీవ్ర ఇస్లామిస్ట్ కాదని, అతను పంది మాంసం కూడా తినేవాడని కొందరు చెబుతుంటారని తెలిపారు. ముస్లింలకు జిన్నా ఓ ఐకాన్‌ అయ్యాడని, అతను ఛాందసవాది కాదని, కానీ, సావర్కర్ మాత్రం ఛాందసవాది అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :