Monday, 23 June 2025 03:04:55 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

TCS: టీసీఎస్‌లో అప్పుడు వేతనం రూ.1,300... నెట్టింట నాటి ఆఫర్ లెటర్ వైరల్

Date : 01 October 2024 03:27 PM Views : 117

Studio18 News - జాతీయం / : రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సింగ్ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన తన టీసీఎస్ ఆఫర్ లెటర్ నెట్టింట వైరల్‌గా మారింది. 1989 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి 1984లో టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించారు. ఇందుకు సంబంధించిన ఆఫర్ లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 40 ఏళ్ల క్రితం ఆయన వేతనం, ఇతర వివరాలు ఆ ఆఫర్ లెటర్‌లో ఉన్నాయి. ఈ ఆఫర్ లెటర్ ప్రకారం... దీనిని 1984 జూన్ 20న ఇచ్చారు. 1984 జూన్ 4 నుంచి నెలకు రూ.1,300 వేతనం ఇస్తున్నట్లుగా అందులో ఉంది. నలభై ఏళ్ల క్రితం తాను బీహెచ్‌యూ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సెలక్ట్ అయ్యానని, ముంబై టీసీఎస్ క్యాంపస్‌లో తనకు మొదట ఉద్యోగం వచ్చిందని రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. అప్పట్లో తన వేతనం 1,300 గా ఉందని, అది చాలా ఎక్కువ అన్నారు. నారీమన్ పాయింట్‌లోని ఎయిరిండియా 11వ అంతస్తు నుంచి సముద్రం చూసేందుకు అద్భుతంగా ఉండేదన్నారు. 1984లో టీసీఎస్‌లో చేరిన రోహిత్ కుమార్ సింగ్ మాస్టర్ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ కోసం న్యూయార్క్ క్లార్క్‌సన్ యూనివర్సిటీలో చేరారు. మాస్టర్ డిగ్రీ తర్వాత అతను భారత్ తిరిగి వచ్చి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు రాశారు. అందులో క్వాలిఫై అయి ఐఏఎస్ అయ్యారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :