Studio18 News - జాతీయం / : న్యూఢిల్లీ: ఇటీవల బాస్మతి బియ్యం(Basmati Rice) ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీశ్ గోయల్ ఓ ప్రకటన చేశారు. బాస్మతి బియ్యానికి అధిక డిమాండ్ ఉందని, దాని వల్లే ఆ రైస్ రేటు పెరిగినట్లు వెల్లడించారు. ఇండోపాక్ ఉద్రిక్తతల వల్ల ఆ బియ్యానికి ధర పెరగలేదన్నారు. బాస్మతి రైస్కి చెందిన 1509, 1718 వెరైటీల ధరలు ఇటీవల మార్చి నెలలో పెరిగాయన్నారు. ఆ బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ఇండోపాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో జరుగుతున్న రవాణా జాప్యం వల్ల బియ్యం ధర పెరగలేదన్నారు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ దేశాల్లో బాస్మతి బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉందని, దాని వల్ల ఆ రేట్లు పెరిగినట్లు చెప్పారు. ఇప్పటి వరకు బాస్మతి బియ్యం వాణిజ్యం ఎటువంటి ప్రభావం పడలేదన్నారు. ఆర్డర్లను చాలా స్మూత్గా డీల్ చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 1509 బాస్మతి వెరైటీ బియ్యాన్ని కిలో రూ.62 కు అమ్మారని, ఆ తర్వాత వాటి ధరలు తగ్గాయని, పంట దిగుబడి పెరగడంవల్ల ధరలు తగ్గాయని ఏఐఆర్ఈఏ మాజీ అధ్యక్షుడు విజయ్ సేథియా తెలిపారు. ఫిబ్రవరి వరకు ఆ వెరైటీ ధర కిలో 52గా ఉందన్నారు. మార్చి నుంచి మాత్రం బియ్యం ధరలు పెరినట్లు చెప్పారు. ఇండో, పాక్ ఉద్రిక్తతలతో సంబంధం లేదన్నారు. 2024-25 సీజన్లో ఇండియా 60 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేశారని, ఇక పాకిస్థాన్ పది లక్షల టన్నుల బియ్యాన్ని షిప్పింగ్ చేసిందన్నారు.
Admin
Studio18 News