Thursday, 15 May 2025 02:01:21 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

పెరిగిన బాస్మ‌తి బియ్యం ధ‌ర‌లు.. ఇండోపాక్ ఉద్రిక్త‌త‌ల వ‌ల్ల కాదు !

బాస్మ‌తి బియ్యానికి అధిక డిమాండ్ ఉంద‌ని, దాని వ‌ల్లే ఆ రైస్ రేటు పెరిగిన‌ట్లు ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ స‌తీశ్ గోయ‌ల్

Date : 09 May 2025 03:00 PM Views : 14

Studio18 News - జాతీయం / : న్యూఢిల్లీ: ఇటీవ‌ల బాస్మ‌తి బియ్యం(Basmati Rice) ధ‌ర‌లు పెరిగాయి. ఈ నేప‌థ్యంలో ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ స‌తీశ్ గోయ‌ల్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. బాస్మ‌తి బియ్యానికి అధిక డిమాండ్ ఉంద‌ని, దాని వ‌ల్లే ఆ రైస్ రేటు పెరిగిన‌ట్లు వెల్ల‌డించారు. ఇండోపాక్ ఉద్రిక్త‌త‌ల వ‌ల్ల ఆ బియ్యానికి ధ‌ర పెర‌గ‌లేద‌న్నారు. బాస్మ‌తి రైస్‌కి చెందిన 1509, 1718 వెరైటీల ధ‌ర‌లు ఇటీవ‌ల మార్చి నెల‌లో పెరిగాయ‌న్నారు. ఆ బియ్యానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంద‌న్నారు. ఇండోపాక్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో జ‌రుగుతున్న ర‌వాణా జాప్యం వ‌ల్ల బియ్యం ధ‌ర పెర‌గలేద‌న్నారు. సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్ దేశాల్లో బాస్మ‌తి బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉంద‌ని, దాని వ‌ల్ల ఆ రేట్లు పెరిగిన‌ట్లు చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు బాస్మ‌తి బియ్యం వాణిజ్యం ఎటువంటి ప్ర‌భావం ప‌డ‌లేద‌న్నారు. ఆర్డ‌ర్‌ల‌ను చాలా స్మూత్‌గా డీల్ చేస్తున్న‌ట్లు చెప్పారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 1509 బాస్మ‌తి వెరైటీ బియ్యాన్ని కిలో రూ.62 కు అమ్మార‌ని, ఆ తర్వాత వాటి ధ‌ర‌లు త‌గ్గాయ‌ని, పంట దిగుబ‌డి పెర‌గ‌డంవ‌ల్ల ధ‌ర‌లు త‌గ్గాయ‌ని ఏఐఆర్ఈఏ మాజీ అధ్య‌క్షుడు విజ‌య్ సేథియా తెలిపారు. ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఆ వెరైటీ ధ‌ర కిలో 52గా ఉంద‌న్నారు. మార్చి నుంచి మాత్రం బియ్యం ధ‌ర‌లు పెరిన‌ట్లు చెప్పారు. ఇండో, పాక్ ఉద్రిక్త‌త‌ల‌తో సంబంధం లేద‌న్నారు. 2024-25 సీజ‌న్‌లో ఇండియా 60 ల‌క్ష‌ల ట‌న్నుల బాస్మ‌తి బియ్యాన్ని ఎగుమ‌తి చేశార‌ని, ఇక పాకిస్థాన్ ప‌ది ల‌క్ష‌ల ట‌న్నుల బియ్యాన్ని షిప్పింగ్ చేసింద‌న్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :