Wednesday, 16 July 2025 11:32:45 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

జమ్మూకశ్మీర్ లో ముగిసిన ఎన్ కౌంటర్... ముగ్గురు ముష్కరులు హతం

Date : 13 May 2025 12:52 PM Views : 65

Studio18 News - జాతీయం / : దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఈరోజు జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కఠిన చర్యలు తీసుకున్న భద్రతా దళాలు, ఇప్పుడు లోయలోపల కూడా ఉగ్రవాద నిర్మూలన చర్యలను తీవ్రతరం చేశాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, షోపియాన్ జిల్లా పరిధిలోని షుక్రు కెల్లర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో అప్రమత్తమైన సైనిక బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపు చర్యలు కొనసాగుతుండగా, ఓ చోట ఉన్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు తక్షణమే ప్రతిస్పందించి, ఎదురుకాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా భద్రతా దళాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వారు స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :