Studio18 News - జాతీయం / : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఓ వైపు 4జీ సేవలను ప్రారంభిస్తూనే.. 5జీపైనా కూడా సన్నాహాలు చేస్తోంది. తాజాగా టెస్టింగ్ దశలో ఉన్న బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరీక్షించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డీఓటీ) క్యాంపస్లో 5జీ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు. ఈ వీడియోను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. 'కనెక్టింగ్ ఇండియా' అనే లైన్తో ఈ వీడియోను షేర్ చేశారు. కాగా, ఈ ఏడాది చివరిలోగా దేశంలోని చాలా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Admin
Studio18 News