Wednesday, 16 July 2025 11:39:08 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

రాహుల్ గాంధీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేసిన కంగనా రనౌత్.. సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం

Date : 04 August 2024 03:20 PM Views : 162

Studio18 News - జాతీయం / : Kangana Ranaut : లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి విమర్శల దాడి చేశారు. ఇటీవల పార్లమెంట్ లో కుల గణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రాహుల్ గాంధీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో రాహుల్ గాంధీ నుదుటిపై పసుపు, ఎర్రబొట్టు, తలపై టోపీ, మెడలో ఏసు క్రీస్తు శిలువ గుర్తుతో ఉంది. ఈ ఫొటోపై ఎవరి కులాన్ని అడగకుండా కుల గణనను నిర్వహించాలనుకునేవాడు అని రాసి ఉంది. కంగనా చేసిన పోస్టు సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. కంగనా పార్లమెంట్ కు అనర్హురాలిగా పేర్కొంటున్నారు. కంగనా రనౌత్ అనారోగ్యంతో ఉంది.. ఆమెను శిక్షించకుండా వదిలేయవద్దు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు.. మీ ద్వేషానికి సమాధానం ఇస్తారు అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ సిగ్గుపడాలి.. మీ తల్లిదండ్రులు మీకు ఎలాంటి మర్యాదలు నేర్పలేదనుకుంటా.. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆమెపై చర్యలు తీసుకోండి అంటూ పేర్కొన్నారు. మరికొందరు కంగనా చేసిన పోస్టుకు మద్దతు తెలుపుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :