Monday, 23 June 2025 02:21:33 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Yogi Sarkar: అలాంటి పోస్టులు పెడితే జీవిత ఖైదు.. యూపీ సర్కార్ హెచ్చరిక

Date : 28 August 2024 02:14 PM Views : 115

Studio18 News - జాతీయం / : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెడతానంటే ఆనక చింతించాల్సి వస్తుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు తప్పదని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అనుచిత పోస్టులపై సీఎం యోగి కన్నెర్ర చేశారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి తాజాగా మంగళవారం ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ 2024 కు యోగి సర్కారు ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే జరిమానా, శిక్ష విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే అరదండాలు తప్పవని, మరీ సీరియస్ పోస్టులు పెట్టిన వారికి జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాల ప్రచారానికి ఈ కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో అనుచిత పోస్టుల కట్టడికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ పథకాలను రెగ్యులర్ గా తమ తమ ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తే నెలనెలా రూ.8 లక్షల వరకు అందజేస్తామని తెలిపింది. ఈమేరకు మంగళవారం యూపీ సర్కారు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :