Friday, 14 February 2025 08:00:03 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Bangladesh Crisis : మరికొన్ని రోజులు భారత్ లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. షాకిచ్చిన యూకే!

Date : 06 August 2024 10:51 AM Views : 511

Studio18 News - జాతీయం / : sheikh hasina : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో కొన్నిరోజులుగా అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్‌ హాసీనా రాజీనామా చేసింది. ఆ తరువాత ఆమె దేశం విడిచిపెట్టింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. ఆమె భారత్ నుంచి తన సోదరి నివసించే లండన్ (యునైటెడ్ కింగడమ్) కు వెళ్లొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం.. యూకే రాజకీయ ఆశ్రయం కోసం హసీనా అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆమె భారత్ లోనే ఉన్నారు. ఆమె భారత్ లోనే మరికొన్ని రోజులు ఉండనున్నారు. యూకే ను హసీనా ఆశ్రయం కోరింది. ఆ అనుమతులు వచ్చే వరకు భారతదేశంలో తలదాచుకునేందుకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతి ఇచ్చింది. అయితే, ఆమె ఎన్నిరోజులు భారత్ లో ఉంటుందనే అంశంపై స్పష్టత లేదు. యూకే నుంచి అనుమతి వచ్చేవరకు హసీనా భారత్ లోనే ఉంటారని తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లా – భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సరిహద్దులకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఆర్మీ యూనిట్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ లో పరిస్థితులపై భారత్ వైఖరిని విదేశాంగ మంత్రి అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. షేక్ హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమతి తెలిపింది. మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యునైటెడ్ కింగ్ డమ్ అభిప్రాయపడింది. అమెరికా కూడా స్పందించింది. బంగ్లాదేశ్ లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు ప్రజాస్వామ్య పద్దతిలో జరగాలని సూచించింది. సైన్యం చొరవ తీసుకొని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు. మిగిలిన దేశాలు కూడా బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులపై నిశితంగా గమనిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :