Thursday, 15 May 2025 02:50:37 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Bangladesh Crisis : మరికొన్ని రోజులు భారత్ లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. షాకిచ్చిన యూకే!

Date : 06 August 2024 10:51 AM Views : 980

Studio18 News - జాతీయం / : sheikh hasina : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో కొన్నిరోజులుగా అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్‌ హాసీనా రాజీనామా చేసింది. ఆ తరువాత ఆమె దేశం విడిచిపెట్టింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. ఆమె భారత్ నుంచి తన సోదరి నివసించే లండన్ (యునైటెడ్ కింగడమ్) కు వెళ్లొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం.. యూకే రాజకీయ ఆశ్రయం కోసం హసీనా అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆమె భారత్ లోనే ఉన్నారు. ఆమె భారత్ లోనే మరికొన్ని రోజులు ఉండనున్నారు. యూకే ను హసీనా ఆశ్రయం కోరింది. ఆ అనుమతులు వచ్చే వరకు భారతదేశంలో తలదాచుకునేందుకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతి ఇచ్చింది. అయితే, ఆమె ఎన్నిరోజులు భారత్ లో ఉంటుందనే అంశంపై స్పష్టత లేదు. యూకే నుంచి అనుమతి వచ్చేవరకు హసీనా భారత్ లోనే ఉంటారని తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లా – భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సరిహద్దులకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఆర్మీ యూనిట్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ లో పరిస్థితులపై భారత్ వైఖరిని విదేశాంగ మంత్రి అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. షేక్ హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమతి తెలిపింది. మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యునైటెడ్ కింగ్ డమ్ అభిప్రాయపడింది. అమెరికా కూడా స్పందించింది. బంగ్లాదేశ్ లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు ప్రజాస్వామ్య పద్దతిలో జరగాలని సూచించింది. సైన్యం చొరవ తీసుకొని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు. మిగిలిన దేశాలు కూడా బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులపై నిశితంగా గమనిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :