Wednesday, 16 July 2025 10:51:14 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Manohar Lal Khattar: ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారు: మనోహర్ లాల్ ఖట్టర్

Date : 08 October 2024 05:00 PM Views : 138

Studio18 News - జాతీయం / : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46 కాగా... బీజేపీ 50 స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని హర్యానా ప్రజలు తిరస్కరించారని చెప్పారు. గత పదేళ్లుగా హర్యానా ప్రజలకు ఎంతో చేసిన బీజేపీకి హ్యాట్రిక్ కట్టబెట్టారని అన్నారు. ప్రధాని మోదీ పాలసీలు హర్యానా ప్రజలపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపాయనే మెసేజ్ ను ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని ఖట్టర్ చెప్పారు. హర్యానా ప్రజలు తెలివైనవారని, మెచ్యూరిటీ ఉన్నవారని కితాబిచ్చారు. నయబ్ సింగ్ సైనీని మళ్లీ సీఎం చేస్తారా? అనే ప్రశ్నకు బదులుగా... దీనిపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని... ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టంగా చెప్పారని ఖట్టర్ తెలిపారు. మరోవైపు, ఈ ఏడాది మార్చి వరకు హర్యానా సీఎంగా ఖట్టర్ ఉన్నారు. ఆయన స్థానంలో నయబ్ ను ముఖ్యమంత్రిగా చేసిన బీజేపీ అధిష్ఠానం... ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :