Thursday, 12 March 2026 03:57:09 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

CBSE Board Exams 2025: సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం.. ఇకనుంచి సీసీటీవీ నిఘాలో పరీక్షల నిర్వహణ

Date : 28 September 2024 11:56 AM Views : 393

Studio18 News - జాతీయం / : CBSE Board Exams 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో నిర్వహించబోయే 10, 12 బోర్డు పరీక్షలు సీసీటీవీ నిఘాలో జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుబంధ పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది. 2025లో జరగనున్న బోర్డు పరీక్షా కేంద్రాల్లో నిఘా కెమెరాలు తప్పనిసరి చేసినట్లు అందులో పేర్కొంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఏడాది సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు భాతదేశంలోని 8వేల పాఠశాలల్లో, విదేశాల్లోని 26 దేశాల్లో కలిపి సుమారు 44 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని బోర్డు అంచనా వేసింది. పరీక్షల నిర్వహణపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాసిన లేఖలో సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సన్యాం భరద్వాజ్ కీలక సూచన చేశారు. పరీక్షా కేంద్రాలుగా ఎంపికచేసే అన్ని పాఠశాలలు తప్పనిసరిగా సీసీటీవీ పర్యవేక్షణలో ఉండాలని స్పష్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా పరీక్షా హాళ్లలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయాలని చెప్పారు. కెమెరాలు తప్పని సరిగా అధిక రిజల్యూషన్ తో ఉండాలి.. అంతేకాక.. కెమెరాలు పరీక్ష హాల్ మొత్తాన్ని రికార్డు చేసేలా ఏర్పాటు చేయాలని, పుటేజీలను సురక్షితంగా భద్రపర్చాలని భరద్వాజ్ సూచించారు. సీసీటీవీ నిఘా సౌకర్యం లేని ఏ పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేయొద్దని భరద్వాజ్ పాఠశాలలకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. రికార్డ్ పుటేజీ సంబంధిత అధికారులు మాత్రమే చూసేందుకు వీలుంటుందని, పరీక్షా ఫలితాలు వచ్చిన రెండు నెలల వరకు ఈ పుటేజీ భద్రంగా ఉంటుందని తెలిపారు. ప్రతీ పది గదుల పర్యవేక్షణకు ఒక వ్యక్తిని నియమిస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీల ఏర్పాటుతో పరీక్షల విధానంలో ఎటుంటి ఆటంకం లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భరద్వాజ్ తెలిపారు. ఇదిలాఉంటే.. సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :