Monday, 23 June 2025 03:14:14 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

CBSE Board Exams 2025: సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం.. ఇకనుంచి సీసీటీవీ నిఘాలో పరీక్షల నిర్వహణ

Date : 28 September 2024 11:56 AM Views : 118

Studio18 News - జాతీయం / : CBSE Board Exams 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో నిర్వహించబోయే 10, 12 బోర్డు పరీక్షలు సీసీటీవీ నిఘాలో జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుబంధ పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది. 2025లో జరగనున్న బోర్డు పరీక్షా కేంద్రాల్లో నిఘా కెమెరాలు తప్పనిసరి చేసినట్లు అందులో పేర్కొంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఏడాది సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు భాతదేశంలోని 8వేల పాఠశాలల్లో, విదేశాల్లోని 26 దేశాల్లో కలిపి సుమారు 44 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని బోర్డు అంచనా వేసింది. పరీక్షల నిర్వహణపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాసిన లేఖలో సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సన్యాం భరద్వాజ్ కీలక సూచన చేశారు. పరీక్షా కేంద్రాలుగా ఎంపికచేసే అన్ని పాఠశాలలు తప్పనిసరిగా సీసీటీవీ పర్యవేక్షణలో ఉండాలని స్పష్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా పరీక్షా హాళ్లలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయాలని చెప్పారు. కెమెరాలు తప్పని సరిగా అధిక రిజల్యూషన్ తో ఉండాలి.. అంతేకాక.. కెమెరాలు పరీక్ష హాల్ మొత్తాన్ని రికార్డు చేసేలా ఏర్పాటు చేయాలని, పుటేజీలను సురక్షితంగా భద్రపర్చాలని భరద్వాజ్ సూచించారు. సీసీటీవీ నిఘా సౌకర్యం లేని ఏ పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేయొద్దని భరద్వాజ్ పాఠశాలలకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. రికార్డ్ పుటేజీ సంబంధిత అధికారులు మాత్రమే చూసేందుకు వీలుంటుందని, పరీక్షా ఫలితాలు వచ్చిన రెండు నెలల వరకు ఈ పుటేజీ భద్రంగా ఉంటుందని తెలిపారు. ప్రతీ పది గదుల పర్యవేక్షణకు ఒక వ్యక్తిని నియమిస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీల ఏర్పాటుతో పరీక్షల విధానంలో ఎటుంటి ఆటంకం లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భరద్వాజ్ తెలిపారు. ఇదిలాఉంటే.. సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :