Friday, 13 June 2025 03:54:57 AM
# ట్రైనీ డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లిన విమానం... ఘటన స్థలంలో అందినకాడికి దోపిడీలు! # కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ # ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభ‌మైంది: మంత్రి లోకేశ్‌ # కూలిన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు... బతికే అవకాశాలు స్వల్పం! # జర్నలిస్టు కృష్ణంరాజుకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు # కూలిపోయిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ...? # అహ్మదాబాద్ విమాన దుర్ఘటన... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో మాట్లాడిన ప్రధాని మోదీ # ఘోర విమాన ప్రమాదం... గుజరాత్ సీఎంకు అమిత్ షా ఫోన్ # అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి # రోడ్డు పక్కన ఓ బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోయిన రఘురామ... కూల్చివేతకు ఆదేశాలు! # పంజాబ్ నుంచి యూకేకి బుల్లెట్ బండి, ఫర్నిచర్.. రూ.4.5 లక్షలు ఖర్చుపెట్టిన ఫ్యామిలీ! # రైల్వేశాఖ కొత్త నిబంధన.. తత్కాల్ బుకింగ్‌కు ఇక ఆధార్ తప్పనిసరి # 'తల్లికి వందనం' నిధులు నేడే విడుదల.. 67 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి # బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై దాడి # ఏఎంఏ అధ్యక్షుడిగా మన తెలుగు వైద్యుడు.. అమెరికా వైద్య చరిత్రలో నూతన అధ్యాయం! # ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి # కేజీబీవీ టాయిలెట్‌లో భారీ కొండచిలువ కలకలం # తెలిసి ఏ తప్పు చేయలేదు: సెల్ఫీ వీడియో విడుదల చేసిన ప్రముఖ జానపద గాయని మంగ్లీ # విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు # యోగాంధ్రకు సర్వం సిద్ధం.. గిన్నిస్ రికార్డు కోసం భారీ సన్నాహాలు

Subramanian Swamy: శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం.. సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిష‌న్‌

Date : 23 September 2024 03:03 PM Views : 139

Studio18 News - జాతీయం / : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం క‌ల్తీ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ల‌డ్డూ త‌యారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు క‌ల‌కలం రేపుతోంది. జాతీయ స్థాయిలో దీనిపై చ‌ర్చ‌ జరుగుతోంది. ఇటు ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్ వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారాయి. ప్ర‌పంచ న‌లుమూల‌ల‌కు చెందిన‌ కోట్లాది మంది భ‌క్తులు కల్తీ లడ్డూ విష‌య‌మై ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కోట్లాది మంది ఆరాధ్య దైవ‌మైన వేంక‌టేశ్వ‌రుడి తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌నే విష‌యాన్ని భ‌క్తులు జీర్ణించుకోవ‌డం కష్టంగా మారింది. దీనికి కార‌ణ‌మైన బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాలంటూ సామాన్యుల‌ నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు కోరుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఈ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్ర‌బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌పై వెంట‌నే విచార‌ణ జ‌ర‌పాల్సిందిగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ సంద‌ర్భంగా సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి మాట్లాడుతూ... తిరుమ‌ల ప్ర‌సాదం ల‌డ్డూపై చంద్ర‌బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఈ ఆరోప‌ణ‌లు భ‌క్తుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయ‌న్నారు. స‌మ‌గ్ర విచార‌ణ కోసం ఓ క‌మిటీని వేయాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నిజానిజాలు బ‌య‌ట‌కు రావాల‌నే ఉద్దేశంతో అత్యున్న‌త న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు చెప్పారు. ఇదిలాఉంటే.. శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై టీటీడీ మాజీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో ఓ పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై కోర్టు ఇవాళ మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :