Wednesday, 16 July 2025 10:28:52 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు

Date : 02 June 2025 01:12 PM Views : 46

Studio18 News - జాతీయం / : పోలవరం-బనకచర్ల నీటి తరలింపు ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సుమారు రూ. 81 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు వివరాలను, దాని ద్వారా రైతులు మరియు ప్రజలకు చేకూరే ప్రయోజనాలను రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రధానమంత్రికి, కేంద్ర ఆర్థిక మంత్రికి స్వయంగా వివరించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు సహా ఇతర ఉన్నతాధికారులు నేడు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ కి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్‌లో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు కేంద్రానికి అందించనున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణకు సంబంధించిన అంశాలు, ప్రజలకు కలిగే లాభనష్టాలపై స్పష్టమైన చిత్రాన్ని ఇవ్వనున్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ఆర్థికంగా స్వీయ సమృద్ధి సాధించేలా ఉంటుందని, ఒక స్వయం సమృద్ధ ఆర్థిక ప్రాజెక్టుగా నిలుస్తుందని కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి వ్యక్తమయ్యే అవకాశం ఉన్న అభ్యంతరాలకు కూడా ఈ ప్రజెంటేషన్‌లో సమాధానాలు ఇచ్చేలా ఏపీ అధికారులు సన్నద్ధమైనట్లు సమాచారం. ఈ సమావేశం ద్వారా ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :