Saturday, 07 March 2026 08:15:35 PM
# సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం

నదిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు.. లడఖ్ లో ఐదుగురు సైనికుల మృతి

LAC,Soldiers Killed,Ladakh, Tank Mishap, JCO

Date : 29 June 2024 12:31 PM Views : 546

Studio18 News - జాతీయం / : రివర్ క్రాసింగ్ ఎక్సెర్ సైజ్ చేస్తుండగా ప్రమాదం నదిలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహం నీటిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు

Also Read : ఇంటి ప్రధాన ద్వారంపై వినాయకుడి చిత్రాన్ని ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది?

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ లో ఘోరం చోటుచేసుకుంది. ఎల్ఏసీ వద్ద యుద్ధ ట్యాంకులో శిక్షణ పొందుతున్న ఐదుగురు సైనికులు దుర్మరణం పాలయ్యారు. రివర్ క్రాసింగ్ ఎక్సర్ సైజ్ చేస్తుండగా ఈ ఘోరం జరిగిందని అధికారవర్గాల సమాచారం. మరణించిన వారిలో ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సరిహద్దులకు సమీపంలో ఓ నది దాటుతుండగా టీ-72 యుద్ధ ట్యాంకు ప్రమాదానికి గురైందని, అందులో ఉన్న ట్రైనీ సోల్జర్లు, ఓ జేసీవో చనిపోయారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ట్రైనింగ్ లో భాగంగా టీ-72 యుద్ధ ట్యాంకులో ఓ జేసీవో, మరో నలుగురు సైనికులు నది దాటేందుకు ప్రయత్నించారు. అయితే, సడెన్ గా ఎగువ నుంచి వరద రావడంతో నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ట్యాంకు కొట్టుకుపోయింది. ట్యాంకుతో పాటు అందులోని సోల్జర్లు గల్లంతయ్యారు. సోల్జర్లు బతికిబయటపడే అవకాశంలేదని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) కు సమీపంలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :