Wednesday, 16 July 2025 11:37:29 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Amanatullah Khan: ఢిల్లీ వక్ఫ్‌బోర్డు కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ ఇంటిపై ఈడీ దాడి.. విరుచుకుపడుతున్న నేతలు

Date : 02 September 2024 02:07 PM Views : 138

Studio18 News - జాతీయం / : ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ నివాసంపై ఈడీ ఈ ఉదయం దాడి చేసింది. ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంటే ఆయన ఇంటి బయట పోలీసులు, పారామిలటరీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ సందర్భంగా అమానతుల్లాఖాన్ తన ఎక్స్‌ ఖాతాలో ఈ విషయాన్ని చెబుతూ తనను అరెస్ట్ చేసేందుకు ఇప్పుడే ఈడీ అధికారులు తన ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. కాగా, అమానతుల్లా ఇంటిపై ఈడీ సోదాలను ఆప్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ చేతిలో అస్త్రంగా మారిపోయిన ఈడీ ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని మండిపడింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను ఈడీ అణచివేస్తోందని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా విమర్శించారు. తమకు లొంగని వారిని ఈడీ కటకటాల వెనక్కి పంపిస్తోందని ఆరోపించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అమానతుల్లాఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా ప్రధాని మోదీ నియంతృత్వం, ఈడీ గూండాయిజం కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతల విమర్శలపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ మాట్లాడుతూ.. అమానతుల్లాఖాన్ నివాసంపై ఈడీ సోదాలను సమర్థించారు. ఆప్‌లో అవినీతి నేతల గ్రూపు ఒకటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిపై చట్టం తనపని తాను చేస్తుంటే వారు అరవడం మొదలుపెడతారని విమర్శించారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమాలకు పాల్పడిన అమానతుల్లాఖాన్ ఈడీ చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంవడిపడ్డారు. అక్రమాలకు పాల్పడితే సమాధానం చెప్పాల్సిందేనని, చట్టానికి ప్రతి ఒక్కరు సమానమేనని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :