Wednesday, 16 July 2025 11:15:18 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఈసారి ముందే... అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు

Date : 13 May 2025 03:30 PM Views : 64

Studio18 News - జాతీయం / : తీవ్రమైన వేసవి తాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి శుభవార్త అందించింది. దేశ వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ, అంచనాల కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో నికోబార్ దీవుల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇవి మరింతగా విస్తరించి, అండమాన్ నికోబార్ దీవుల మొత్తంతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు చేరుకుంటాయని, ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ నెల 27వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇదివరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలోకి ప్రవేశించే నైరుతి, ఈసారి సుమారు నాలుగు రోజుల ముందే రానుండటం గమనార్హం. ఇది సాకారమైతే, 2009 తర్వాత రుతుపవనాలు ఇంత ముందుగా రావడం ఇదే ప్రథమం అవుతుంది. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఇక, ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుండటం ఊరటనిచ్చే అంశం. భారతదేశంలో దాదాపు 52 శాతం సాగుభూమి వర్షాధారంగానే ఉంది. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో 40 శాతం ఈ భూముల నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో, దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి నైరుతి రుతుపవనాలే ఆధారం. అంతేకాకుండా, దేశంలోని జలాశయాలు నిండటానికి, తాగునీటి అవసరాలు తీర్చడానికి, విద్యుదుత్పత్తికి, తద్వారా దేశ జీడీపీ వృద్ధికి నైరుతి వర్షాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :