Wednesday, 16 July 2025 11:18:14 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Shashi Tharoor: ఎగ్జిట్ పోల్స్ వ్యవస్థ సిగ్గుపడేలా హర్యానా ట్రెండ్స్ ఉన్నాయి: శశి థరూర్

Date : 08 October 2024 01:35 PM Views : 117

Studio18 News - జాతీయం / : హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా సాగుతోంది. మొత్తం 90 సీట్లకు గాను కూటమి 52 స్థానాల్లో లీడ్ లో ఉండగా... బీజేపీ 27 స్థానాల్లో ముందంజలో ఉంది. హర్యానాలో ఎర్లీ ట్రెండ్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినప్పటికీ... ఆ తర్వాత పరిణామాలు ఊహించని విధంగా మారిపోయాయి. బీజేపీ మ్యాజక్ ఫిగర్ ను దాటి లీడ్ లోకి వచ్చింది. ప్రస్తుతం హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గాను 49 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉండగా... కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యతను కనపరుస్తోంది. హర్యానాలో బీజేపీ గెలుపు ఖాయమనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశి థరూర్ మాట్లాడుతూ... హర్యానాలో బీజేపీ లీడ్ లోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఇప్పటికిప్పుడే ఎన్నికల ఫలితాలపై ఒక అంచనాకు రావద్దని... వేచిచూద్దామని చెప్పారు. హర్యానా ట్రెండ్స్... మొత్తం ఎగ్జిట్ పోల్స్ వ్యవస్థ సిగ్గుపడేలా ఉన్నాయని తెలిపారు. పూర్తి ఫలితాలు వెలువడేంత వరకు మనం వేచి చూద్దామని అన్నారు. హర్యానా ఫలితాలపై తాము ఎన్నో అంచనాలు పెట్టుకున్నామని... అయితే, తాము ఊహించిన విధంగా లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. జమ్మూకశ్మీర్ కన్నా హర్యానాలో ఇండియా బ్లాక్ మెరుగైన స్థితిలో ఉంటుందని భావించామని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :