Sunday, 08 February 2026 12:56:35 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Wayanad : వయనాడ్ విపత్తులో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Date : 02 August 2024 11:28 AM Views : 400

Studio18 News - జాతీయం / : Wayanad Landslides : కేరళ రాష్ట్రం వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం ఉదయం వరకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 316కు చేరింది. మృతుల్లో 27 పిల్లలు, 76 మంది మహిళలు ఉన్నారు. 220 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. నాలుగు రోజులుగా వాయనాడ్‌ జిల్లాలో మెప్పాడి, ముండకై, చురల్మల, అత్తమల, నూల్ పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సహాయక చర్యల్లో మరింత వేగం పెంచారు. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక కార్యక్రమాల్లో వెయ్యి మందికిపైగా సిబ్బంది పాల్గొంటున్నారు. రికార్డు సమయంలో చూరల్‌మల – ముండక్కై మధ్య 190 అడుగుల బెయిలీ వంతెన నిర్మాణాన్ని ఆర్మీ విజయవంతంగా పూర్తి చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి గురువారం సాయంత్రం 5:30 గంటలకు బెయిలీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అట్టామల, ముండక్కై చూరల్‌మల వద్ద ప్రస్తుతం ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. వాయనాడ్‌లోని ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌లను మేజర్ జనరల్ వీటీ మాథ్యూ పర్యవేక్షిస్తున్నారు. చలియార్ నది నుంచి తీసుకొచ్చిన మృతదేహాలను గుర్తించడంలో కుటుంబ సభ్యులుకు కష్టంగా మారుతుంది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి 25 కిలో మీటర్ల దూరంలో నిలంబూరులోని చలియార్ నదిలో ఈ మృతదేహాలు దొరికాయి. ప్రొక్లేయినర్లు, జేసీబీలతో బురదను, శిథిలాలను సహాయక సిబ్బంది తొలగిస్తున్నారు. బండరాళ్లను పగలగొట్టి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఆధునిక సాంకేతిక యంత్రాలతో గల్లంతైన వారిని మట్టిలో కూరుకుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తిస్తున్నారు. వాయనాడ్‌లో జరిగిన ఘోర ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :