Wednesday, 16 July 2025 11:02:55 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Wayanad : వయనాడ్ విపత్తులో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Date : 02 August 2024 11:28 AM Views : 143

Studio18 News - జాతీయం / : Wayanad Landslides : కేరళ రాష్ట్రం వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం ఉదయం వరకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 316కు చేరింది. మృతుల్లో 27 పిల్లలు, 76 మంది మహిళలు ఉన్నారు. 220 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. నాలుగు రోజులుగా వాయనాడ్‌ జిల్లాలో మెప్పాడి, ముండకై, చురల్మల, అత్తమల, నూల్ పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సహాయక చర్యల్లో మరింత వేగం పెంచారు. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక కార్యక్రమాల్లో వెయ్యి మందికిపైగా సిబ్బంది పాల్గొంటున్నారు. రికార్డు సమయంలో చూరల్‌మల – ముండక్కై మధ్య 190 అడుగుల బెయిలీ వంతెన నిర్మాణాన్ని ఆర్మీ విజయవంతంగా పూర్తి చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి గురువారం సాయంత్రం 5:30 గంటలకు బెయిలీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అట్టామల, ముండక్కై చూరల్‌మల వద్ద ప్రస్తుతం ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. వాయనాడ్‌లోని ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌లను మేజర్ జనరల్ వీటీ మాథ్యూ పర్యవేక్షిస్తున్నారు. చలియార్ నది నుంచి తీసుకొచ్చిన మృతదేహాలను గుర్తించడంలో కుటుంబ సభ్యులుకు కష్టంగా మారుతుంది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి 25 కిలో మీటర్ల దూరంలో నిలంబూరులోని చలియార్ నదిలో ఈ మృతదేహాలు దొరికాయి. ప్రొక్లేయినర్లు, జేసీబీలతో బురదను, శిథిలాలను సహాయక సిబ్బంది తొలగిస్తున్నారు. బండరాళ్లను పగలగొట్టి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఆధునిక సాంకేతిక యంత్రాలతో గల్లంతైన వారిని మట్టిలో కూరుకుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తిస్తున్నారు. వాయనాడ్‌లో జరిగిన ఘోర ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :