Monday, 28 April 2025 05:22:43 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Rajnath Singh: రాడార్ కేంద్రానికి రేవంత్ రెడ్డి సహకరించారు: రాజ్‌నాథ్ సింగ్ అభినందన

Date : 15 October 2024 05:03 PM Views : 78

Studio18 News - జాతీయం / : వీఎల్ఎఫ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరించారని, అందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ రాడార్ స్టేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీలు వేరైనప్పటికీ దేశ అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు. రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందన్నారు. అబ్దుల్ కలాం జయంతి రోజున ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. దేశ భద్రతకు వీఎల్ఎఫ్ స్టేషన్ కీలకమని, కమ్యూనికేషన్ విషయంలో ఈ కమాండ్ సెంటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. దేశ రక్షణకు ఇది అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పావురాలు, గుర్రాల దశ నుంచి ఈ స్థాయికి వచ్చాం కమ్యూనికేషన్ రంగంలో మనం పావురాలు, గుర్రాల దశ నుంచి ఇక్కడి వరకు వచ్చామన్నారు. తపాలా వ్యవస్థను అనేక ఏళ్ళు వినియోగించుకున్నామని కేంద్రమంత్రి అన్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగమని, క్షణాల్లో సమాచారం ప్రపంచానికి చేరుతోందన్నారు. సమాచార విప్లవం ఈరోజు దేశాలన్నింటినీ దగ్గర చేస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో సమాచార విప్లవం కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. ఇంట్లో కూర్చొని అనేక కోర్సులు నేర్చుకుంటున్నారని తెలిపారు. రాడార్ స్టేషన్ కోసం 2,900 ఎకరాల భూమి అప్పగింత ఇది భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) రాడార్ స్టేషన్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం ఇక్కడి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల క్రితం విశాఖపట్నం కేంద్రంగా పని చేస్తోన్న ఈస్టర్న్ నావెల్ కమాండ్‌కు అప్పగించింది. ఇక్కడ రాడార్ స్టేషన్‌తో పాటు టౌన్ షిప్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంకు, మార్కెట్ తదితర సదుపాయాలు ఉండనున్నాయి. ఈ టౌన్ షిప్‌లో 3,000 మంది వరకు నివసించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, సిబ్బంది 600 మందికి పైగా ఉంటారు. ఈ వీఎల్ఎఫ్ కేంద్రాన్ని 2027 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :