Wednesday, 16 July 2025 10:52:48 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Narendra Modi: ప్రపంచంలోని ప్రతి డివైస్ లో భారత్‌లో తయారు చేసిన చిప్ ఉండాలనేది కల: ప్రధాని మోదీ

Date : 11 September 2024 05:35 PM Views : 148

Studio18 News - జాతీయం / : ప్రపంచంలోని ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ లో భారత్‌లో తయారు చేసిన చిప్‌ ఉండాలనేది తమ ఆకాంక్ష అని, దేశంలోనే 100 శాతం ఎలక్ట్రానిక్‌ తయారీ జరగాలన్నదే తమ కల అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో 'సెమికాన్ ఇండియా 2024'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెమీకండక్టర్ల రంగానికి చెందిన ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. భారత్‌ను సెమీ కండక్టర్ పవర్ హౌస్‌గా మార్చేందుకు చేయాల్సిందంతా చేస్తామన్నారు. దేశంలో ప్రస్తుతం త్రీ డైమెన్షనల్ పవర్ ఉందన్నారు. అనుకూలమైన ప్రభుత్వం, తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం, ఆశావహ మార్కెట్... ఈ మూడు భారత్‌లో ఉన్నాయన్నారు. టెక్నాలజీ రుచి ఏమిటో తెలిసిన ఇలాంటి మార్కెట్ మరోచోట దొరకదన్నారు. భారత్‌లో మార్కెట్ అనుకూల వాతావరణం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే సరఫరా గొలుసు అన్నింటికీ ముఖ్యమన్నారు. అలాంటి సరఫరా గొలుసును సృష్టించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. కరోనా సమయంలో ఈ విషయంలో భారత్‌కు ఎదురు దెబ్బలు తగిలాయని గుర్తు చేశారు. ఇప్పుడు భారత్‌లో కనుక పెట్టుబడులు పెడితే 21వ శతాబ్దంలో చిప్స్ కొరత రానే రాదన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి... విలువను సృష్టించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు. చిప్ అంటే కేవలం సాంకేతికతకు మాత్రమే పరిమితం కాదని, కోట్లాదిమంది పౌరుల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమం అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :