Thursday, 17 July 2025 12:05:20 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న వాల్మీకి ప్రజలు

Date : 01 October 2024 12:08 PM Views : 184

Studio18 News - జాతీయం / : జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి నేడు జరుగుతున్న మూడో విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ప్రజలు తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాల్మీకి ప్రజలు మాట్లాడుతూ.. దశాబ్దాల తర్వాత ఓటు వేసే హక్కు సొంతమైందని ఆనందంగా చెప్పారు. ఇకనైనా తమ సామాజిక వర్గానికి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సమాజంలో తమ సామాజిక వృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ మార్పు తర్వాత తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. 85 ఏళ్ల లాల్‌చంద్ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడుతూ.. తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తన పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు. వారు బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి భవిష్యత్తు బాగుండాలనే ఓటు వేసినట్టు వివరించాడు. ఇదే సామాజిక వర్గానికి చెందిన ఏక్తా మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వం కూడా ఓట్లు అడుగుతుందని, కానీ, తమకు ఓటు హక్కే లేదని, ఓటు ఎలా వేస్తామని ప్రశ్నించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం మంచి పనిచేసిందని కృతజ్ఞతలు తెలిపారు. తమకు చాలా అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. తమ భవిష్యత్తుకు పాటుపడే ప్రభుత్వాలనే ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :