Monday, 17 February 2025 05:17:51 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Rahul Gandhi: వయనాడ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Date : 01 August 2024 06:21 PM Views : 61

Studio18 News - జాతీయం / : వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన తండ్రి చనిపోయినప్పుడు ఎంతగా బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నానన్నారు. బాధితులకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చామన్నారు. తానొక్కడినే కాదని... ఈ విషాదాన్ని చూసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు. ఇది హృదయాన్ని కదిలిస్తోందన్నారు. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకే తాను వచ్చానన్నారు. చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోయారు... ఇళ్లనూ పొగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. తమవంతు సాయం కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు సాయం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే తనకు నోట మాట రావడం లేదని ప్రియాంకగాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :