Wednesday, 25 June 2025 07:10:59 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Sanket Bawankule: మద్యం మత్తులో తన ఆడి కారుతో పలు వాహనాలను ఢీకొట్టి పరారైన మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడు

Date : 10 September 2024 01:06 PM Views : 130

Studio18 News - జాతీయం / : తన ఆడి కారుతో నాగ్‌పూర్‌లోని రాందాస్‌పేట ప్రాంతంలో పలు వాహనాలను ఢీకొట్టిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే కుమారుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ బవాంకులే కుమారుడు సంకేత్ బవాంకులే సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన అర్జున్ హవారే, రోణిత్ చింతాన్వర్ ఇద్దరూ ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆడికారు తొలుత ఫిర్యాదుదారు జితేంద్ర సొంకాంబలే కారును తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ మోపెడ్‌పై వెళ్తున్న మరో ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో సంకేత్ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. ఆ సమయంలో వారు ధరంపేట్‌లోని ఓ బారు నుంచి తిరిగి వస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. సొంకాంబలే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిలుపై వారిని విడిచిపెట్టారు. ఆ కారు తన కుమారుడి పేరుపైనే రిజిస్టర్ అయి ఉన్నట్టు బీజేపీ మహారాష్ట్ర చీప్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాత విచారణ చేపట్టి, నిందితులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమేనని, తాను ఏ పోలీసు అధికారితోనూ మాట్లాడలేదని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :